Rythu Bandhu | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రైతులకు ఈ యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని గతంలో మాదిరిగానే అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుబంధు నిధులను మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ ఒక రైతుకూ ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం పంపిణీ చేయాలని సూచించారు.
సోమవారం ఆయన సచివాలయంలో వ్యవసాయశాఖపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు మూడున్నర గంటలపాటు సాగిన సమావేశంలో ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ, రూ.2 లక్షల రుణమాఫీపై సుదీర్ఘంగా చర్చించారు. రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15 వేలు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున అందజేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో మ్యానిఫెస్టో అమలు సాధ్యాసాధ్యాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. రైతుభరోసా పథకంపై అసెంబ్లీలో చర్చించిన తరువాత పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించినట్టు సమాచారం. అప్పటివరకు ప్రస్తుత విధానంలోనే రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అంటే గతంలో మాదిరిగానే ప్రతిరోజూ ఎకరాల వారీగా, ఎకరానికి రూ.5 వేల చొప్పున (ఈ సీజన్కు) పెట్టుబడి సాయం అందించనున్నారు.
వ్యవసాయంపై సమీక్ష సందర్భంగా రూ.2 లక్షల రుణమాఫీ హామీపై సీఎం రేవంత్రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల మేరకు రుణాలు మాఫీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు.
సాగుభూములకే రైతుబంధు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
రైతులకు అందజేసే పెట్టుబడి సాయంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. సాగు చేసే భూములకు మాత్రమే రైతుబంధు అందజేస్తామని స్పష్టంచేశారు. పది ఎకరాలకు మించిన సాగుభూములు ఉన్న వారు చాలాకొద్దిమందే ఉంటారని పేర్కొన్నారు. పెట్టుబడి ఖర్చులు, ఎరువులు, మందుల ధరలు విపరీతంగా పెరిగినందున ప్రస్తుతం ఇస్తున్న రూ.5 వేలకు మరో రూ.2,500 కలిపి ఎకరాకు రూ.7,500 చొప్పున ఇస్తామని తెలిపారు.
ఈసీ ఆదేశాలతో నిలిచిన రైతుబంధు
నిజానికి యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని గత నవంబర్ నెలలోనే అందజేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల కోడ్ పేరుతో తొలుత ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. యాసంగి సీజన్ మొదలైన నేపథ్యంలో రైతుబంధు అందజేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసీకి లేఖలు రాసింది.
పీఎం కిసాన్ నిధుల పంపిణీకి కేంద్రానికి అనుమతి ఇచ్చిన విధంగానే తమకూ అనుమతి ఇవ్వాలని కోరింది. ఎట్టకేలకు రైతుబంధు పంపిణీకి నవంబర్ 24న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈసీ 28వ తేదీ వరకు మాత్రమే పంపిణీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఆ వెంటనే 25,26,27 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడం, ఆ తరువాత ఈసీ అనుమతులు వెనక్కి తీసుకోవడంతో రైతుబంధు పంపిణీ సాధ్యం కాలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి పాత విధానమే కొనసాగించాలని నిర్ణయించడం విశేషం.
ఇప్పటివరకు 72,817 కోట్లు పంపిణీ
బీఆర్ఎస్ ప్రభుత్వం 2018-19 వానకాలం సీజన్లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ ఏడాది వానకాలం సీజన్ వరకు తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా రూ.72,817.04 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. తొలి విడతలో ఈ పథకం కింద 50.25 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, ప్రస్తుతం ఈ సంఖ్య 68.99 లక్షలకు చేరింది.
ఆయిల్పామ్ను మరింత ప్రోత్సహించాలి: మంత్రి తుమ్మల
ఆయిల్పామ్ సాగు చేసే రైతులు మంచి దిగుబడి సాధిస్తున్నారని, మంచి గిట్టుబాటు ధర లభిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్పామ్ సాగును మరింత ప్రోత్సహించాలని, ఇందులో అంతర పంటగా పుచ్చకాయలు పండించేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో సోమవారం వ్యవసాయ శాఖపై మంత్రి తొలి సమీక్ష నిర్వహించారు. రైతులకు నూతన వ్యవసాయ విధానాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని, అదే విధంగా పంట ఉత్పత్తి పెంచాలని చెప్పారు.
రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల మారెటింగ్ను పెంచాలని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తరకం పంటలను రైతులకు పరిచయం చేయాలని, వాణిజ్య పంటల సాగుపై అవగాహన కల్పించడంతోపాటు వారిని మానసికంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. మామిడి, జామ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఆ పంటల సాగుకు సహాయపడాలని చెప్పారు. సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావుతోపాటు పలు విభాగాల ఎండీలు, ఏడీలు తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ చెలామణిపై ఉక్కుపాదం: సీఎం
రాష్ట్రంలో మాదకద్రవ్యాల చెలామ ణి, వినియోగంపై ఉకుపాదం మోపాలని సీఎం రేవంత్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల వి నియోగం, నివారణపై సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగించినా, విక్రయించినా కఠిన చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న తెలంగాణ స్టేట్ యాంటి నారొటిక్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్ను నియమించడంతోపాటు ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూరుస్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రేహౌండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీఎస్నాబ్ను తీర్చిదిద్దాలని అన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని స్పష్టం చేశారు.