హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన తన చాంబర్లో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, విశ్వేశ్వర్రావు, రమామేల్కొటే, రియాజ్, పురుషోత్తమ్తోపాటు యోగేంద్రయాదవ్, గాదె ఇన్న య్య తదితర పౌర సమాజం ప్రతినిధులతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలను సీఎం వారికి వివరించారు. త్వరలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ను ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. విద్యా విధానం ఎలా ఉండా లో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. పంటల బీమా పథకాన్ని అమలుచేస్తామని, కౌలు రైతు రక్షణకు చట్టం తేవాలని యోచిస్తున్నట్టు వివరించారు. పెట్టుబడి సా యం ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామని సీఎం అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో ఏర్పాటు చేయబోతున్నామని, పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ పాల్గొన్నారు.