హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy )బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ(Delhi tour)కి బయలుదేరారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ఉన్నారు. ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాలతో భేటీ కానున్నారు. వీరితో రాబోయే పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) నేపథ్యంలో టికెట్ల కేటాయింపు, చేరికలు, గెలుపు వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తి కావడంతో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి కూడా ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం.