హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లకు (స్టాఫ్నర్స్) స్టేడియం వేదికగా బుధవారం నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అందజేశారు. కాగా, 7,094 స్టాఫ్ నర్స్(Nursing officers) పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా తుది ఎంపిక జాబితాను ప్రకటించారు. మొత్తం 9 విభాగాల్లో 6,956 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
కాగా, 7,094 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా తుది ఎంపిక జాబితాను ప్రకటించారు. మొత్తం 9 విభాగాల్లో 6,956 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అయితే ఆర్థోపెడికల్ చాలెంజ్డ్ క్యాటగిరీలోఅభ్యర్థులు లేకపోవడంతో 138 పోస్టులు భర్తీ కాలేదని అధికారులు తెలిపారు.
నర్సింగ్ ఆఫీసర్లకు కనీస వేతనం రూ.36,750తోపాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.