Revanth Reddy | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కారు ఆర్బీ ఐ నుంచి మరో రూ.2,000 కోట్ల అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణం సేకరించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 28 ఏండ్లకాల పరిమితికి 6.79% వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు తీసుకున్నది. మరో రూ. వెయ్యి కోట్లను 32 ఏండ్లకాల పరిమితికి 6.80% వార్షిక వడ్డీకి సేకరించింది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.14 వేల కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. ఏప్రిల్లో 3 దఫాల్లో రూ.4,400 కోట్లు తీసుకున్నది. రెండో నెల మేలో తొలి మంగళవారమే రూ.2,000 కోట్లు సేకరించింది. ఆర్థిక సంవత్సరం మార్కెట్ రుణాల కింద రూ.64,539 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో డిప్యూటీ సీఎం భట్టి ప్రతిపాదించారు.