హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తుందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు.
ముస్లింల రిజర్వేషన్లను ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్షా రద్దు చేస్తామని అంటున్నారని, ఇది వారి వల్ల కానేకాదని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మైనార్టీ గురుకుల కార్యదర్శి ఐసా మస్రత్ ఖానం, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.