హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) అన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనుకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
‘కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.’ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
లాస్య నందిత మృతిపట్ల మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు. చిన్న వయస్సులో లాస్య నందిత అకాల మరణం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నందిత అకాల మరణం బాధాకరమని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. యువ ఎమ్మెల్యే ఆకస్మిక మరణం కలచివేసిందని మంత్రి ఉత్తమ్ అన్నారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇటీవలే ఎమ్మెల్యేగా గెలిచి అంతలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సాయన్న మరణం నుంచి తేరుకొక ముందే వారి కుమార్తె లాస్య నందిత కూడా చనిపోవడం అందరినీ కలిచి వేస్తున్నదని చెప్పారు
కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం… ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం.
వారి కుటుంబానికి నా… pic.twitter.com/Y44sF8Jvi9
— Revanth Reddy (@revanth_anumula) February 23, 2024