హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి, డీజీపీ రవిగుప్తాతోపాటు పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సన్మానించారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహస్వామి ఆలయ ప్రధాన అర్చక బృందం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని కలిసి స్వామివారి ఆశీర్వచనాలు అందించారు. సీఎం రేవంత్ను ఆయన ఇంటివద్ద, సచివాలయంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.