హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): , ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం తమ హయాంలో ఉద్యోగాలు కల్పిస్తామని పునరుద్ఘాటించారు.
యూపీఎస్సీ తరహాలో త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్-1 పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. మూతపడిన సింగిల్ టీచర్ స్కూళ్లను మళ్లీ తెరిపించేందుకు మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ‘గురుకుల కాంప్లెక్స్’లు నిర్మిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులు వాటిల్లోనే కలిసి చదువుకుంటారని తెలిపారు. సుమారు 20 ఎకరాల్లో ఒకే ప్రాంగణంలో నాలుగు గురుకులాలను నిర్మిస్తామని, ఇందుకు అన్ని నియోజకవర్గాల్లో స్థలాలను ఎంపిక చేయాలని వేదిక మీద నుంచి సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. ఇట్లాంటి కాంప్లెక్స్లను పైలట్ ప్రాజెక్టుగా తొలుత కొడంగల్లో నిర్మిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం విద్యపై 6శాతం మాత్రమే నిధులు ఖర్చు చేస్తే తాము 10-12 శాతం ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని చెప్పారు. గ్రూప్-4 ఉద్యోగాలకు కూడా త్వరలోనే నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. సొంత భవనాల్లో గురుకులాలు నిర్మించేందుకు అన్ని అనుమతులు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పా రు. మెస్ చార్జీలను ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ‘ఈ-చానెల్’ను తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తెలిపారు. తమది చేతల ప్రభుత్వమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలు స్వీకరించబోతున్న వారికి సీఎస్ శాంతికుమారి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ అనుదీప్, ఐఏఎస్లు రోనాల్డ్ రోస్, హన్మంతరావు, గురుకులాల అధికారులు హన్మంతునాయక్ తదితరులు పాల్గొన్నారు.