CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ఫార్మాసిటీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెనక్కి తగ్గారు. దాన్ని రద్దు చేస్తున్నామని గతంలో ప్రకటించిన ఆయన, తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. మెట్రో రైలు రెండో విడతను కూడా పూర్తిగా రద్దు చేయటం లేదని, అలైన్మెంట్ మాత్రమే మార్చుతామని స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటిలో మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఔటర్ రింగ్రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రత్యేక క్లసర్లుగా ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాటిని కాలుష్య రహిత క్లస్టర్లుగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఆయా పరిశ్రమల్లో పనిచేసేవారు హైదరాబాద్ వరకు రాకుండా క్లస్టర్లలోనే ఇండ్ల నిర్మాణం, ఇతర ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. యువతకు అవసరమైన సిల్స్ పెంచేందుకు ప్రత్యేక వర్సిటీలు ఏర్పాటుచేస్తామని, ప్రముఖ పారిశ్రామిక వేత్తల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఉంటుందని వెల్లడించారు. వాటిలో చదివిన వారికి సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని, క్యాంపస్లోనే ప్లేస్మెంట్స్ ఇస్తామని చెప్పారు. విదేశాలకు వెళ్లే యువతకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. 100 పడకల దవాఖాన ఉన్నచోటే అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామ న్నారు. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్హౌస్గా మారుస్తామని చెప్పారు.
మెట్రో అలైన్మెంట్లో మార్పు
శంషాబాద్ విమానాశ్రయానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన మార్గాలతో పోల్చితే దూరం తగ్గేలా అలైన్మెంట్ మార్చుతామని సీఎం తెలిపారు. గచ్చిబౌలి నుంచి విమానాశ్రయానికి మెట్రో లో వెళ్లేవారు ఉండరని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్ట్కు 32 కిలోమీటర్లు వస్తుందని, ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్పోర్టు వరకు ఏర్పాటు చేస్తామని వివరించారు. మరోవైపు నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఒవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రోలైన్కు లింక్ చేస్తామన్నారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని చె ప్పారు. కొత్తగా మెట్రో లైన్ల వల్ల ఖర్చు, దూరం తగ్గుతుందని తెలిపారు.
నియామకాల్లో సామాజిక న్యాయం
ప్రభుత్వ శాఖల్లో అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా చూస్తానని సీఎం చెప్పారు. ప్రతిభ కలిగిన అధిపతులను నియమించటం వర కు తాను చూస్తానని, వాళ్ల పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని, సక్రమంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టంచేశారు. ఈ నెల 3న పీసీసీ విసృ్తతస్థాయి సమావేశం ఉన్నదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పదవులు ఇస్తామని వివరించారు. బంధుప్రీతికి తావు ఉండదని, పార్టీ కోసం పనిచేసిన వారితోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని తేల్చి చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని త్వరలో భర్తీ చేస్తామని, 100 రోజుల్లో జర్నలిస్టుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఫార్మాసిటీని రద్దుచేస్తామంటూ మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్.