Revanth Reddy | హైదరాబాద్, అక్టోబరు 29 (నమస్తే తెలంగాణ): తాను ఫుట్బాల్ ప్లేయర్నని, గేమ్ప్లాన్పై పూర్తి స్పష్టత ఉందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న తన కల నెరవేరిందని, ఇంతకుమించి పెద్ద కలలు వేరే ఏమీ లేవ ని తెలిపారు. కొరియా పర్యటనకు వెళ్లి వ చ్చిన జర్నలిస్టులతో సచివాలయంలో మంగళవారం రేవంత్ చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ రాజకీయంగా నష్టం జరిగినా ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్, కా ళేశ్వరం, విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ జరుగుతున్నదని, విచారణ సమయంలో కక్ష సాధింపులు ఉండబోవని, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యా పింగ్ నిందితుల పాస్పోర్ట్ రద్దయిందని, కాబట్టి అనధికారికంగా విదేశాల్లో ఉండలేరని చెప్పారు. తనది చిన్న వయసని, రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉందని, అణచివేతతో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకోలేనని, ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తానని వివరించారు.
రాజకీయాల్లో నాది ప్రత్యేక ైస్టెల్
అక్రమ సొమ్ముతో సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తున్నదని రేవంత్రెడ్డి ఆరోపించారు. సినిమా ల్లో రాజమౌళి, రాంగోపాల్వర్మ.. ఇద్దరి దీ వేర్వేరు స్టయిల్ అని, రాజకీయాల్లో త న స్టయిల్ తనదని, కేటీఆర్ స్టయిల్ కేటీఆర్దని పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని తెలిపారు. కేసీఆర్ను ప్రజలు మర్చిపోయేలా టార్గెట్ చే సినట్టు చెప్పారు. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్ను వాడానని, త్వరలో కేటీఆర్ ఉ నికి లేకుండా హరీశ్ను వాడతానని, బా వను ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసని పేర్కొన్నారు. పోలీసులను పెట్టి వాళ్లను నిర్బంధించవచ్చని, కానీ అది తన విధానం కాదని చెప్పారు. వారు వెళ్లి ప్రజల ఆలోచనను తెలుసుకునే అవకా శం కల్పిస్తున్నానని తెలిపారు. కేటీఆర్ కూకట్పల్లి వెళ్లి చిన్నారికి బ్యాగ్ ఇచ్చాడని, తానేమో ఇల్లు ఇస్తాడని అనుకున్నానని ఎద్దేవా చేశారు. స్మార్ట్సిటీ, స్పోర్ట్స్ సిటీలను అభివృద్ధి చేస్తామని, రూ. 300 కోట్ల నిధులతో స్కిల్ యూనివర్సిటీని ని ర్వహిస్తామని వివరించారు. ఇప్పటి వర కు రూ. 49 వేల కోట్ల అప్పు తెచ్చామని, కేసీఆర్ చేసిన రూ. 56 వేల కోట్ల అప్పు తీర్చామని రేవంత్ వివరించారు.