CM Revanth | హైదరాబాద్ : రాజకీయాలు ఎలా ఉన్నా కేసీఆర్ హైదరాబాద్ను అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు వైఎస్, చంద్రబాబు కూడా హైదరాబాద్ను డెవలప్ చేశారని తెలిపారు. హోటల్ వెస్టిన్లో సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్య, నైపుణ్యాభివృద్ధి – వ్యవస్థాపక అవకాశాలు అంశంపై నిర్వహించిన సమావేశంలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానం అని రేవంత్ స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటాం. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు.
తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తాం అని సీఎం చెప్పారు. 64 ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నాం అని తెలిపారు. స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నాం. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తాం. గతంలో ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారు. ఇప్పుడది హైదరాబాద్కు లైఫ్ లైన్ గా మారిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
సీఐఐ ఆధ్వర్యంలో ‘విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక అవకాశాలు’ అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించిన ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు. pic.twitter.com/fJDtaRBzL9
— Telangana CMO (@TelanganaCMO) February 21, 2024