హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పెండింగ్ నిధులు ఇప్పించి, తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హక్కులను, హామీలను త్వరితగతిన అమలు చేయాలని విన్నవించినట్టు చెప్పారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు సుమారు అరగంటపాటు ప్రధానితో వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ప్రధానితో భేటీ వివరాలను భట్టి విక్రమార్క తెలంగాణ భవన్లో మీడియాకు వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో తొలిసారిగా దేశ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా సీఎం హోదాలో రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం హోదా లో తాను కలిసినట్టు వెల్లడించారు. విభజన చట్టం హామీలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. బయ్యారం ఉకు పరిశ్రమ, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులను వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జా తీయ హోదా ఇవ్వాలని విన్నవించినట్టు తెలిపారు. వీటితోపాటు ఐఐఎం, సైనిక్ సూల్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద గ ల 14 రోడ్ల ప్రతిపాదనలను, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించే గ్రాంట్స్ను విడుదల చేయాలని ప్రధానిని కోరినట్టు చెప్పా రు. కేంద్ర ప్రభుత్వంనుంచి రాష్ర్టానికి రావాల్సిన రూ.2,250 కోట్ల గ్రాంట్స్ను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని విన్నవించినట్టు తెలిపారు. తమ విజ్ఞప్తులపై ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ప్రధాని మోదీతో భేటీ కోసం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లా రు. ప్రధాని నివాసంలో ఇద్దరు నేతలు అరగంటపాటు మోదీతో సమావేశమయ్యారు.