హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): మారెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మకై రైతుల ఉత్పత్తులకు తక్కువ ధర చెల్లించేందుకు యత్నిస్తే సహించబోమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో బుధవారం జరిగిన ఘటనలో సత్వరం స్పందించి చర్యలు తీసుకున్న అదనపు కలెక్టర్ను అభినందిస్తూ సీఎం గురువారం ట్వీట్ చేశారు.
జనగామ వ్యవసాయ మారెట్లో రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మారెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్కు అభినందనలు తెలిపారు.ధాన్యం కొనుగోళ్లలో ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉన్నదని సీఎం చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.