CM KCR | బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నరు.. గడ్డికోత్తున్ర. వీళ్లకు మాట్లాడడం చేతనైతలేదా? వీళ్లజాగలో వేరే ఎంపీ గెలిచినా మనకు మొఖం తెలివి ఉండేది. కానీ, ఎంపీలు నోరు తెరువరు. నరేంద్ర మోదీ ఒక్కటీ ఇవ్వడు. వీళ్లకు అడిగితే దమ్ములేదు’ అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బోథ్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
‘అనిల్ జాదవ్ను గెలిపిస్తే నెల రోజుల్లోనే బోథ్ను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇస్తున్నా. నాకు తెలుసు డిగ్రీ కాలేజీ కావాలని కోరుతున్నరు. వందశాతం ఇస్తామని మనవి చేస్తున్నా. ఈ ప్రాంతంలో హార్టికల్చర్ అంటే కూరగాయలు పండియడం ఎక్కువగా ఉంటుది. మాకు కోల్డ్ స్టోరీ కావాలని మార్కెట్ యార్డులో కావాలని ఎప్పటి నుంచి కోరుతున్నరు. తప్పకుండా బ్రహ్మాండమైన కోల్డ్ స్టోరీ పెట్టిస్తమని మనవి చేస్తున్నా. గిరిజనులకు పోడు భూములు ఇచ్చాం. గిరిజనులు కానివారివద్ద కూడా పోడు భూములు ఉన్నయ్. అవి ఇవ్వాలని కేంద్రానికి పంపితే వాళ్లు అడ్డంపెట్టుకొని కూసున్నరు. వచ్చే టర్మ్లో కేంద్రంతో పోరాడి వారికి తప్పకుండా పట్టాలు ఇప్పిస్తమని హామీ ఇస్తున్నా’నన్నారు.
‘బీజేపీ పదేళ్లయే పాలించవట్టి. కాంగ్రెస్ మనల్ని ఆంధ్రాలో కలిపి గోసపుచ్చుకున్నది. బీజేపీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటంటే ఒక్కటిఈ తెలంగాణకు ఇవ్వలేదు. నవోదయ పాఠశాలల కూడా ఇవ్వలేదు. ప్రతి కొత్త జిల్లాకో పాఠశాల ఇవ్వాలని పార్లమెంట్లో చట్టం ఉన్నది. మనం 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. నేను వంద ఉత్తరాలు నరేంద్ర మోదీకి రాశాను. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వనటువంటి బీజేపీ.. ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది ? ఇక్కడి నుంచే బీజేపీకి ఎంపీ ఉన్నడు. ఇసోంటోళ్లు నలుగురు ఎంపీలున్నరు. వీళ్లు ఏం చేస్తున్నరు.. గడ్డికోత్తున్ర. వీళ్లకు మాట్లాడడం చేతనైతలేదా. వీళ్లజాగలో వేరే ఎంపీ గెలిచినా మనకు మొఖం తెలివి ఉండేది. కానీ ఎంపీలు నోరు తెరువరు. నరేంద్ర మోదీ ఒక్కటీ ఇవ్వడు. వీళ్లకు అడిగితే దమ్ములేదు.. మళ్లీ ఇవాళ ఎన్నికల్లో నిలబడ్డరు. ఒక్క స్కూలు, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు. మనం చెడిపోతం తప్ప. మంచిది కాదు’ అన్నారు.
‘నన్ను ఎవరూ అడుగలేదు. నేను సర్వే చేయించినా. కుంటాలకు పోయి వాగు మనదగ్గరి నుంచే పోతది కాబట్టి.. ఇక్కడ కుఫ్టి రిజర్వాయర్ కట్టాలి. తప్పకుండా దాంతో లాభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ టర్మ్లో కుఫ్టి రిజర్వాయర్ను కూడా మొదలుపెట్టించి పూర్తి చేయించే బాధ్యత నాది. బోధ్ బాధలో ఎన్నో బాధలు అనుభవించారు. అవన్నీ మీకు తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని ఎలా ఆదుకుంటుందో.. ఎన్ని రకాల సాయం చేస్తుందో మీకు తెలుసు. సంక్షేమ కార్యక్రమాల్లో తొలిసారిగా పెన్షన్ రూ.2వేలు ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ.
ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ రూ.200 మొఖాన కొట్టింది. రూ.200 పెన్షన్ను రూ.2వేలు చేసిన బీఆర్ఎస్ చేసింది. రూ.2వేల పెన్షన్ను రూ.5వేలు చేస్తది. రైతుబంధును రూ.10వేల నుంచి రూ.16వేలకు తీసుకుపోతున్నాం. ఇవాళ వచ్చే కరెంటు కాటకలవద్దంటే.. మన భూములు మనకే జాగ్రత్తగా ఉండాలంటే, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ను తెచ్చుకుంటనే సాధ్యమైతది. అనిల్ జాదవ్ ప్రజల్లో కలిసుండే వ్యక్తి. అనిల్ జాదవ్ను గెలిపిస్తే బ్రహ్మాండంగా బోథ్ నియోజకవర్గంలో కోరిన పనులన్నీ చేసేపెట్టే బాధ్యత నాది’ అని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు.