హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ను దేశ ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నట్టు నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ చెప్పారు. చేతివృత్తులకు లక్ష ఆర్థిక సహాయం చేస్తామని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంపై హర్షం ప్రకటించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద మంగళవారం నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి, 111 కొబ్బరికాయలు కొట్టారు.
కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వేముల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘం శివ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జెమి మురళీకృష్ణ, జిల్లా నాయకులు శ్రీరాముల శ్రీనివాస్, యాదాద్రి జిల్లా మీడియా సెల్ కన్వీనర్ పయ్యావుల నితీశ్ పాల్గొన్నారు.