హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ది గొప్ప మనసని, ఆర్టీసీ ఉద్యోగులకు గొప్ప వరం ప్రకటించి వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కొనియాడారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
వెయ్యి కోట్ల నిధి గ్యారెంటీని కల్పించి, పీఎఫ్ చెల్లించి ఆర్టీసీ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ దకేలా చూడాలని, పీఆర్సీ చెల్లించాలని సీఎంను కోరామని చెప్పా రు. కానీ, సీఎం కేసీఆర్ ఏకంగా కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేసి, గొప్ప మనసు చాటుకున్నారని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు.