హనుమకొండ : స్థానిక సంస్థలకు ప్రత్యేక నిధులు కేటాయించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులతో ఆయన మాట్లాడారు.
ఇటీవల ఎంపీటీసీలకు ప్రత్యేక అభివృద్ది నిధులు కేటాయించినందుకు మంత్రి ఎర్రబెల్లికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎంపీపీలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీలతో మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి తోనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉందన్న నిజాన్ని గుర్తించి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.
పల్లెల్లో నూతన కాంతులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018 సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిధులు కొరత ఉండ కూడదనే లక్ష్యంతో ప్రతి నెల 227 కోట్ల 50 లక్షల రూపాయలు గ్రాంటును గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
అందులో గ్రామ పంచాయతీలకు 210 కోట్ల 44 లక్షల రూపాయలు, మండల పరిషత్ లకు 11 కోట్ల 41 లక్షల రూపాయలు, జిల్లా పరిషత్లకు 5 కోట్ల 65 లక్షల రూపాయలు ప్రతి నెల తప్పక విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 6 వేల 955 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయడం జరిగిందన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పరిషత్ లో 251 కోట్ల రూపాయలు, మండల పరిషత్లకు 249 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు.
రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచి, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
గర్భశోకం మిగిల్చిన రోజే.. కవలలకు జన్మ
CM Jagan |సీఎంగా నన్ను దించడానికి ప్రయత్నిస్తున్నారు..
మత్స్యరంగానికి ఊపిరి పోసిన సీఎం కేసీఆర్ : మంత్రి తలసాని