హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ప్రభు త్వ రంగ సంస్థల రక్షణే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ లక్ష్యమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మికుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోదీ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రూప్సింగ్ తదితరులు బీఆర్ఎస్కే జెం డాను ఎగురవేశారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదని మంత్రి మల్లారెడ్డి చె ప్పారు. కార్మికుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పం టితో తీస్తామని అన్నారు. వేడుకల్లో టీఎస్టీడీసీ చైర్మ న్ గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.