హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు, అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో ఆత్మశుద్ధి, పరివర్తనను కలిగిస్తాయని సీఎం పేర్కొన్నారు.
మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని సీఎం ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరుడిగా, హిందువులు కొలిచే ఆ మహాదేవుడి దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.