హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన కొత్త సచివాలయం నిర్మాణ పనులు కొనసాగుతోన్న విషయం విదితమే. ఈ సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంబంధిత శాఖల ఇంజినీర్లు ఉండనున్నారు.
యాసంగిలో పండించిన వరి ధాన్యం సేకరణ, ఏర్పాట్లతో పాటు వానాకాలంలో వరిసాగు సన్నద్ధతపై సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం అమలు తీరుతెన్నులపై కూడా అధికారులతో కేసీఆర్ చర్చించారు.