హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు రానున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ప్రెస్మీట్ ప్రగతి భవన్లో జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలపై కూడా కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రెస్మీట్లో ఏం మాట్లాడుతారా? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి మొదలైంది.