హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ సదస్సులపై అవగాహన కల్పించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన 11వ తేదీన సమీక్ష జరగనుంది. ప్రగతి భవన్లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇంకా అక్కడక్కడా మిగిలివున్న భూ సమస్యల పరిషారానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కేసీఆర్ నిన్న అధికారులకు సూచించిన విషయం విదితమే. మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేసి, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ సదస్సులు నిర్వహించాలని సీఎం తెలిపారు.