హైదరాబాద్ : ఈ నెల 18వ తేదీన జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. దళిత బంధుతో పాటు ఇతర అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు వాసాలమర్రిలో దళిత బంధు పథకం అమలైన విషయం తెలిసిందే.