హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఉత్తరర్పదేశ్లోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వ్రగామం సైఫయీకి మంగళవారం మధ్యాహ్నం సీఎం చేరుకొంటారు. ములాయం పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. ములాయం అంత్యక్రియల్లో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ వెంట పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కూడా వెళ్లనున్నారు.
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ త్రీవ ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్మనోహర్ లోహియా, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రాజ్నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయంసింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం పేర్కొన్నారు. ఉత్తరర్పదేశ్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితాంతం నిరుపేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పనిచేశారని గుర్తుచేసుకొన్నారు. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్యాదవ్కు, వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.