మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కలిసి పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం, తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయం, మెడికల్ కాలేజీ పనుల పురోగతి, ఏర్పాట్లపై చర్చించారు. మహబూబాబాద్లో నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలన్నారు.
ఈ సమీక్షలో మహబూబాబాద్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, తాత మధు, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, తాటికొండ రాజయ్య, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీరంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, గోవింద్ నాయక్,
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తదితరులు ఉన్నారు.