హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి, నేరుగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశాలున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఈ నెల 7న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు 2022–23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న సీఎం కేసీఆర్ 91,142 ఉద్యోగాలను భర్తీచేస్తామని ప్రకటించారు. అనంతరం వివిధ పద్దులపై శాసనసభ సుదీర్ఘంగా చర్చిస్తున్న సంగతి తెలిసిందే.