నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వంలో మహిళ సంక్షేమానికి అనేక పథకాలు అమలవుతున్నాయని అసెంబ్లీ స్పీకర్ పోపోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ‘కేసీఆర్ మహిళా బంధు’ కార్యక్రమం బాన్సువాడ పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని ఆడబిడ్డల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో మహిళలకు కొండంత అండ దొరికిందన్నారు. కాగా, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ హకీమ్ కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు.