CM KCR | హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మీద దాడి చేసి ప్రాణాలు తీయాలను చూశారని, భగవంతుడి దయవల్ల ఆయన ప్రాణాలకు అపాయం తప్పిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని అన్నారు. ‘రాజకీయాల్లో ప్రతీపశక్తులుంటాయి. ప్రగతి వ్యతిరేక శక్తులుంటాయి.
ఆ శక్తులకు ప్రజాస్వామ్యయుతంగా బుద్ధిచెప్పా లి’ అని కోరారు. మంగళవారం తెలంగాణభవన్లో మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి, కొల్లాపూర్ నేత రాంపుల్లారెడ్డి, కరీంనగర్ నేత జైపాల్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు. కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అద్భుతమై న రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నదని వివరించారు. తలసరి ఆదాయంలో, విద్యుత్తు వినియోగంలో, 24 గంటల కరెంట్ సరఫరా విషయంలో తెలంగాణ ముందున్నదని తెలిపారు.
ఉద్యమ స్ఫూర్తి చాటాలి
పార్టీలో చేరిన మాజీ మంత్రి నాగం, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డి, వారి అనుచరులతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు ఎక్కడిక్కడ ఐకమత్యంగా ముందుకు సాగాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణవ్యాప్తంగా సైనికుల్లాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడిక్కడ పాత, కొత్త అనే తేడాలేకుండా ఐక్యతను ప్రదర్శిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని ఉద్బోధించారు.
1969 తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లిన నాయకుడిగా, తనతో కలిసి అనేక అంశాల్లో పోరాటం చేసిన నాయకుడిగా మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ నెమరువేసుకున్నారు. తనకు అత్యంత ఆప్తుడు పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్రెడ్డి బీఆర్ఎస్లో చేరడం శుభపరిణామంగా అభివర్ణించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగం జనార్దన్రెడ్డి చేరికతో 14కు 14 సీట్లు గెలుచుకోవడం ఖాయమైందని, నాగం సలహాలు, సూచనలు తీసుకొని ముం దుకు సాగాలని మంత్రి నిరంజన్రెడ్డి సహా ఇతర ప్రజాప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
జూబ్లీహిల్స్లో విష్ణువర్దన్రెడ్డి సహా వారి అనుచరులు, ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్న పార్టీ శ్రేణులను కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ నగర పాలక సంస్థ బీజేపీ కార్పొరేటర్లు మర్రి భావన, కచ్చు రవి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి సతీశ్ సైతం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విష్ణువర్ధన్రెడ్డి భవిష్యత్తుకు నాది బాధ్యత: సీఎం కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి భవిష్యత్తుకు తనదే బాధ్యత అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్లో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా పనిచేసిన గొప్ప నాయకుడు పీజేఆర్ తనకు మిత్రుడని, ఆయన కొడుకు విష్ణు తనకు కుటుంబ సభ్యుడితో సమానమని చెప్పారు. హైదరాబాద్లో అనేక సమస్యలపై పోరాటం చేసిన పాపులర్ నాయకుడు పీజేఆర్ కుమారుడిగా విష్ణువర్ధన్రెడ్డికి యూత్లో మంచి క్రేజ్ ఉందని చెప్పారు. జూబ్లీహిల్స్తోపాటు హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా అందరూ కలిసి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు.