CM KCR | కాంగ్రెస్కు నమ్మి ఓటేస్తే కర్నాటకలో గతే చేస్తారని, మనవేలుతోనే మన కన్నే పొడిపించే ప్రయత్నం చేస్తారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. అక్కడ ఐదు గంటల కరెంటు ఇస్తున్నారని.. తెలంగాణలోనూ అదే పరిస్థితిని తీసుకువస్తారన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మాణిక్రావును మరోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కర్నాటకలో ప్రజల గతి ఏమైంది ఇప్పుడు కాంగ్రెస్కు ఓటు వేస్తే ? ఐదుగంటల కరెంటు ఇస్తున్నరు. అక్కడ శివకుమార్ ఆయన ఒకడు ఉన్నడు. అక్కడ ఉప ముఖ్యమంత్రి. ఆయన రంగారెడ్డి సభలో చెప్పుతున్నడు. కేసీఆర్ నీకు తెలుసా? కావాలంటే వచ్చి చూడు రోజుకు ఐదుగంటల కరెంటు ఇస్తున్నం అని చెప్పిండు. సన్నాసి మేం 24గంటల కరెంటు ఇస్తున్నంరా నాయన అని నేను చెప్పిన’ అన్నారు.
‘దబ్బన కాంగ్రెస్ గెలిస్తే మిమ్మల్ని కర్నాటక గతే చేస్తమని వాళ్లు ఓపెన్గా చెబుతున్నరు. మనవేలుతోనే మన కన్నే పొడిపించే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఆలోలించి ఓటు వేయాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఎన్నికలకు ఐదారు రోజులు టైమ్ ఉంది. ప్రతి గ్రామాల్లో ఈ విషయాలపై చర్చ జరిగితే.. క్యూ కట్టి మనకు ఓట్లు గుద్దుతరు. కాబట్టి ఆ పని చేయాలని కోరుతున్నా. ఇక్కడికి నీళ్లు రావాలి. జహీరాబాద్, నారాయణఖేడ్కు నీళ్లు రావాలి. నాకు తెలుసు. ఇప్పుడేం చేసిన మనం కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నం. కాలువ పని అయిపోతున్నది. సింగూరుకు లింక్ చేసుకుంటున్నాం. ఇక్కడ దేవుళ్ల పేర్లు పెట్టుకున్నం. వాళ్ల పుణ్యంతోనైనా జల్ది కావాలని. ఇక్కడికి సంగమేశ్వర లిఫ్ట్, నారాయణఖేడ్కు బసవేశ్వర లిఫ్ట్ పెట్టుకున్నాం. ఇక్కడికి లక్ష ఎకరాలకు నీరు వస్తయ్’ అన్నారు.
‘ఒకప్పుడు ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. నేను మినిష్టర్గా ఉండే రోజుల్లో జహీరాబాద్లో తిరిగిన. ఏడాకులపల్లి రిజర్వాయర్ నేనే నిలబడి కట్టించిన. ఆ చెరువును పెద్ద చేస్తే ఈ రోజు వెయ్యి ఎకరాలు పారుతుంది. ఆ రోజు భాగన్న ఎమ్మెల్యేగా ఉండే. మిషన్ కాకతీయ కింద హరీశ్రావు ఇరిగేషన్ మినిష్టర్గా ఉన్నప్పుడు వందలాది మంచిగ చేసుకున్నం. ఇక్కడ నారింజ ప్రాజెక్టును పట్టించుకున్నోడు లేడు. ఇప్పుడు మాణిక్రావు అడిగిండు. దాన్ని కొంతమేర మంచిగ చేసుకున్నాం. ఇంక కొంత కావాల్సి ఉంది.. తప్పకుండా దాన్ని చేయిస్తానని హామీ ఇస్తున్నాను. సంగమేశ్వర లిఫ్ట్ పనులు మొదలైనయ్. పంప్హౌస్ పనులు జరుగుతున్నయ్. సింగూరుకు కాళేశ్వరం లింక్ అవుతున్నది. ఇక 365 రోజులు సింగూరు నిండ నీళ్లే ఉంటయ్. జహీరాబాద్కు లక్ష ఎకరాలకు నీరు వస్తయ్. తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. సంక్షేమం, ఆరోగ్యం, పాఠశాలలు అనేక విషయాల్లో మంచి పనులు తీసుకొని ప్రభుత్వం ముందుకుపోతున్నది’ అన్నారు.