CM KCR | హైదరాబాద్ : చందానగర్లోని వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి వారిని, ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారిని సీఎం కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఎమ్మెల్యే
అరికెపూడి గాంధీ కూడా ఉన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపన్పల్లిలో 9 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి హాజరైన సంగతి తెలిసిందే.
చందా నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ సముదాయంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి వారిని, ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారిని మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు..… pic.twitter.com/OHwWmgKnPw
— BRS Party (@BRSparty) May 31, 2023