CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు యాదాద్రి భువనగరి జిల్లా పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఆయన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. భువనగిరి జిల్లా ఏర్పాటు చేసుకొని, అద్భుతమైన జిల్లా కలెక్టరేట్కు ప్రారంభించింకున్నందుకు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్ను అభినందిస్తున్నాను. ఎప్పుడు ఎవరూ ఊహించిన మాట కాదు. భువనగిరి జిల్లా అయిదని కలలో ఎవరూ అనుకున్న మాట కాదు. అందరికీ అన్ని విషయాలు అర్థం కావు.
ఆ కారణం వల్ల గతంలో యావత్ భారత్దేశంలో అన్ని రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా.. కేవలం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయలేదు. గతంలో కొందరు కోరినా చేయలేకపోయారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పారు. కారణం ఏదైనా ఆయన సైతం చేయలేకపోయారు. అనేక రకాల అపోహలు, సరైన పద్ధతిలో కుదరకపోవడంతో సాధ్యం కాలేదు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు సంప్రదించి మొదటి వ్యక్తి ఛత్తీస్గఢ్ చీఫ్ అడ్వైజర్.
తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం చేసిన సందర్భంలో నేను ఆయనను డజన్ సార్లు కలవడం జరిగింది. చాలా మందికి అపనమ్మకం, ఆత్మవిశ్వాసం లేకపోవడంతో ఏమో కొట్లాడుతున్నరు గానీ తెలంగాణ అయితదా అని చాలా మంది సంశయజీవులే పెద్ద సంఖ్యలో ఉండిరి. మాకు సంపూర్ణ నమ్మకం ఉండే.. ఈ సారి తెలంగాణ వందకు వందశాతం వస్తదని. ఛత్తీస్గఢ్ అడ్వైజర్ను ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రం కదా.. ఏం చేశారని, ఏం స్టెప్స్ తీసుకున్నరని అడిగి తెలుసుకున్నాం. ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లా ఉండేదని, దానిపై పెద్ద జోక్స్ ఉండేవి. బస్తర్ జిల్లా కేరళ రాష్ట్రం కంటే పెద్దగా ఉంటదని జోక్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని నాలుగైదు జిల్లాలు చేశారు. అందులో ప్రధాన పాత్ర వహించింది ఛత్తీస్గఢ్ అడ్వైజర్.
వారిని అడిగాం అరౌండ్ పది లక్షలు, 10-12 లక్షలు ఉంటే ఈజీ, కొన్ని సందర్భాలు, ప్రత్యేక పరిస్థితుల్లో 5లక్షల పాపులేషన్ ఉన్నా ఆయన గోహెడ్ అని చెప్పారు. భోనగిరి ర్యాపిడ్గా వేగంగా డెవలప్ అయ్యే ప్రాంతం. యాదాద్రి టెంపుల్ అభివృద్ధి అయిపోతే.. అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది. బీబీనగర్, భువనగిరి, ఘట్కేసర్, హైదరాబాద్ అంతా కలిసిపోయి కారిడర్గా ఉంటది. తాను కలగనే కారిడార్ వరంగల్ – హైదరాబాద్ అద్భుతమైన కారిడార్ అవుతుంది. వాటి మధ్యలో వచ్చేవన్నీ గ్రోత్ సెంటర్స్ అవుతాయ్. భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మేడల్చ్ జిల్లా కేంద్రాలు కావడం ద్వారా వచ్చేటటువంటి గ్రోత్.. అందరు సామాన్యులకు అర్థం కాదు.
భువనగిరి, యాదాద్రిలో భూముల ధరలు ఎట్ల ఉన్నయ్.. ఒకప్పుడు ఎట్ల ఉండే. గుట్టపొంటి సైతం కోట్లే. మారుమూల గ్రామాలకు పోతే 25-30లక్షల్లోపు ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదు. మహబూబ్నగర్ జిల్లాలో మాగనూర్ మండల కేంద్రంలో అక్కడ భూమి ఎవరు అడగపోతేది. అక్కడ సైతం రూ.25లక్షల ఎకరంకు తక్కువ లేదు. తెలంగాణ శివారులోని కర్ణాటకలో రూ.4లక్షలు, రూ.5లక్షలు ఉంటే.. మన ప్రాంతంలో రూ.25లక్షలకు తక్కువ లేదని ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి చెప్పిండు. మారు మూల ప్రాంతాల్లోని ఆదిలాబాద్ అడవి జిల్లా, అచ్చంపేట, నారాయణపేట జిల్లాలో భూముల ధరలు పెరిగాయన్నారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.