హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రకు చెందిన పలువురు రైతు సంఘాల నాయకులు శనివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ భవన్లో శనివారం వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మహారాష్ట్ర షేత్కరీ సంఘటనకు చెందిన ముఖ్యనేతలు, పలు జిల్లాల అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, యువజన నాయకులు ఉన్నారు.
వీరిలో ప్రముఖంగా షేత్కరీ యువ సంఘటన అధ్యక్షుడు సుధీర్ బిందు, నేతలు కైలాష్ తవార్, శరద్ మర్కాడ్, సువర్ణకాఠే, రాంజీవన్ బోండార్, నారాయణ్ విభూదే, బీజీ కాకా, అనిల్ రజంకర్, పవన్ కార్వార్, భాగవత్ పాటిల్ ఉన్నారు.చంద్రపూర్ జిల్లాకు చెందిన యువజన నేతలు వంశీకృష్ణ, వాసుదేవ్, సునీల్ ఠాకూర్,ఆతీఫ్ఖాన్, దేవేందర్ లోనర్, రోహిత్ ముప్వార్, పారేఖ్ ఖాన్, రమేశ్, నాగార్జున, విక్రమ్ మోతమ్, దేవసాని అనిల్ కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ బీబీపాటిల్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యేలు బాల సుమన్, జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, బీఆరేఎస్ అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూని, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు రవి కోహెర్, హిమాన్షు తివారీ, మాణిక్ కదమ్ తదితరులు పాల్గొన్నారు.