రంగారెడ్డి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కొంగరకలాన్లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ కొంగరకలాన్కు చేరుకొంటారు. మొదట సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు.
అనంతరం కలెక్టరేట్ సమీపంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు.