హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన సీఎం కేసీఆర్.. అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం తెలంగాణ భవన్ విజిటర్స్ రిజిస్టర్లో సంతకం చేశారు. అంతముకుందు మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇతర నేతలు సీఎం కేసీఆర్కు ఘనంగా ఆహ్వానం పలికారు. మరికాసేపట్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ బీ-ఫారాలు అందజేయనున్నారు. అనంతరం అభ్యర్థులతో కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.