బడంగ్పేట,ఏప్రిల్4: క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడలోని ఏవైఆర్ గ్రౌండ్లో ఏనుగు రాంచంద్రారెడ్డి ట్రస్టు నిర్వాహకులు, కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. 52 క్రికెట్ టీమ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఆదివారం క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన ఇమ్రాన్ సీసీ టీమ్కు రూ. 50వేలు, రన్నర్గా నిలిచిన ఆర్ఎంఆర్ టీమ్కు రూ.25వేల నగదు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్నతనం నుంచి క్రీడల పై ఆసక్తి పెంచుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించిన్నప్పుడే క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ తెలుస్తుందన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందజేస్తుందన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పరంగా సహాయ సహకారం అందిస్తామన్నారు. భవిష్యత్లో మంచి క్రీడాకారులుగా రాణించాలన్నారు. తన తండ్రి పేరు మీద క్రికెట్ పోటీలు నిర్వహించిన కార్పొరేటర్ రాంరెడ్డిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.