TS Minister Srinivas Goud | మంత్రి శ్రీనివాస్ గౌడ్కు, బీఆర్ఎస్కు పీఆర్టీయూ టీఎస్ మద్దతు
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన పీఆర్టీయూ టీఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పీఆర్టీయూ నాయకుడి బిడ్డ, ఉద్యోగ సంఘాల నాయకుడు, ఉద్యమ నేత మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ వచ్చే ఎన్నికల్లో మరోసారి అఖండ మెజారిటీతో గెలిపించే బాధ్యత తమపై ఉందని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ స్పష్టం చేశారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన బీఆర్ఎస్ పార్టీకి, మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వెంటనే పరిష్కరించేలా మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిత్యం తమకు బాసటగా నిలుస్తున్నారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి తాము వెన్నంటి ఉంటామన్నారు.
ఈ కార్యక్రమానికి పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి రఘురాంరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు గోపాల్ నాయక్, యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు భారీగా హాజరయ్యారు.