CM KCR | పెద్దపల్లి : కొంతమంది నాయకులు పైసల కోసం అమ్ముడుపోవచ్చు.. కానీ మంథని ప్రజలకు చైతన్యం ఉంది.. నీవేం రంది పడాల్సిన అవసరం లేదని మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. మంథని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ పార్టీకి హైకమాండ్ ఢిల్లీలో ఉండదు. మన బాసులు తెలంగాణ ప్రజలే. ప్రజలు ఏది కోరితే అదే జరుగుతది. మన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఢిల్లీలో స్విచ్ వేస్తేనే ఇక్కడ లైట్లు వెలుగుతాయి. ఇవన్నీ వట్టి పోసిగాళ్లే. టికెట్ల కోసం ఆఫీసులు కాలబెట్టుకుంటున్నారు. అలా లేదు మన దగ్గర. అందర్నీ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోతున్నాం. వారికి డజన్ మంది సీఎంలు. ఏడాదికి ఎంత మంది మారుతరో తెలియదు.. కర్ణాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఒక నిశ్చితమైన అభిప్రాయం లేకుండా, ఒక సిద్ధాంతం లేకుండా, రాష్ట్రానికో నీతి పెట్టారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా..? తెలంగాణలో ప్రకటించిన స్కీమ్స్ ఛత్తీస్గఢ్లో పెట్టారా..? పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో చేస్తున్నారా..? ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఎన్నికలు అయిపోగానే బయటపడాలనేది కాంగ్రెస్ పని అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
మీ మధ్యలో ఉండే మధును గెలిపించాలి. పుట్ట మధు అదైర్య పడుతున్నారు. కొంత మందిని కొనుక్కుపోతున్నారని. వారి మీద ఊర్లో రియక్షన్ వస్తది. నువ్వేం చితించే పని లేదు. కొన్నోడు, అమ్ముడు పోయినోడు ఎవరో తెలిసిపోతది. నేను కరీనంరగ్ ఎలక్షన్ల ఉన్నప్పుడు అట్లనే చేశారు. చొప్పదండి నియోజకరవ్గంలో ఐదుగురు పార్టీ మండల అధ్యక్షులను కొనేశారు. ఆ ఊర్లలో వారిని దంచిండ్రు.. ఐదు ఓట్లు కూడా రాలేదు. ఇక్కడ కూడా అదే జరుగుతది. నీవేం రందీపడకు ప్రజలకు చైతన్యం ఉంది. ఆ పైసల కోసం మోసపోయేటోళ్లు కాదు ప్రజలు. కొంతమంది పిచ్చి నాయకులు గొర్రెల్లాగా పోవొచ్చు కానీ.. ప్రజలకు అది లేదు. పోయిన సారి జరిగిన నష్టం తెలిసింది. నూరు కథల పడ్డా.. ప్రజల మనసులో ఏముందంటే గ్యారెంటీగా బీఆర్ఎస్ సర్కార్ వస్తది అందులో అనుమానం లేదు. అలాంటప్పుడు మధు ఉంటే లాభమైతది.. వేరే ఆయన ఉంటే లాభమైతదా..? గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేనే రావాలి.. అప్పుడే లాభం జరుగుతది. మంథని ఎమ్మెల్యేగా మధు గెలిస్తేనే మీకు లాభం జరుగుతుంది. ఎక్కడికి పోయినా పని చేసుకొచ్చే సామర్థ్యం ఆయనకు ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.