హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రజకుల అభివృద్ధి సాధ్యమని ఎంబీసీ కోకన్వీనర్, తెలంగాణ రజక సంఘాల సమితి ముఖ్య సలహాదారు కొండూరు సత్యనారాయణ, రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, పురుషోత్తం వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఓ కరపత్రాన్ని విడుదలచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రజకుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.
ఆధునిక దోభీఘాట్లను నిర్మించడంతోపాటు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారని పేర్కొన్నారు. 3,600 మందికి సబ్సిడీ రుణాలను అందజేశారని వెల్లడించారు. ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతోపాటు నిధులను మంజూరు చేశారని చెప్పారు. అన్ని విధాలుగా రజకుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు.