CM KCR Praja Deevena Sabha | ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం ఓటని, దాని ద్వార నిర్మాణమయ్యే శక్తి అని, మనకు ఉపయోగపడుతదా? పడదా? ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు ప్రజాదీవెన సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘మునుగోడు నియోజకర్గం ఒకనాడు ఫ్లోరైడ్ నీళ్లతోని నడుములు వంగిపోయి.. ఏవిధంగా బాధపడ్డదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్కన్నా ముందు.. కేసీఆర్ దొడ్డు, ఎత్తు ఉన్నవాళ్లు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఆనాడు ఇదే జిల్లా బిడ్డ సత్యనారాయణ ఉద్యోగానికి రాజీనామా చేసి జలసాధన పోరాటం చేసి ఆనాడున్న ప్రధానమంత్రి ముందుపడుకోబెట్టి అయ్యా మా బతుకు ఇది అంటే.. ఎవడూ మన మొర వినలే.
ఆ తదనంతరం.. నేనే తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత.. మంత్రి జగదీశ్రెడ్డి చెప్పినట్టు రాష్ట్రమంతా మీ బాధ గురించి చెప్పుతూ వచ్చిన. అంశాల స్వామికావచ్చు, ఫ్లోరైడ్ బాధితులు కావొచ్చు.. దేశ, విదేశాల నుంచి వచ్చి చూస్తా ఉంటే వాళ్ల నిరసన తెలిపి, బాధను వ్యక్తం చేశారు. మే ప్రదర్శన వస్తువులమా? మమ్మల్ని అవమాన పరుస్తున్నరు.. రాకండి.. మీకు దమ్ముంటే సమస్య పరిష్కరించండి అని తిట్టి పంపారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నల్లగొండ నగారా అని పేరుతో పది రోజుల పాటు జిల్లామొత్తం తిరిగి ఫ్లోరైడ్ మీద చైతన్య పరచడం జరిగింది. శివన్నగూడెం గ్రామంలో నిద్రకూడా చేశాను. ఏమయనే నల్లగొండ.. అనే మాట గూడ చెప్పడం జరిగింది.
అనేక ప్రభుత్వ, అనేక పార్టీలు, అనేక రాజకీయాల తర్వాత మనందరి పోరాటాల ఫలితంగా.. మన తెలంగాణకు వస్తే.. ఇవాళ జీరో ఫ్లోరైడ్.. ఫ్లోరైడ్ రహిత మునుగోడు, నల్లగొండగా మార్చుకున్న మిషన్ భగీరథ పథకంతో. ప్రపంచ ఆరోగ్య సంస్థ నల్లగొండ జిల్లా సరైన ప్రయత్నాలు జరుగపోతే మానవ నివాసయోగ్యం కాకుండా పోతుందని, నోమ్యాన్ జోన్ అవుతుందని, ఇక్కడ మనుషులు నివసించలేరు.. ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు ఇవ్వాలి. ఇక్కడ పండే పంటలు తింటే కూడా ప్రమాదమే అని చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా.. ఆ నాడు రాష్ట్ర, దేశ పాలకులు పట్టించుకోలేదు. మంచినీళ్లైతే కిందపడి మీదపడి తెచ్చుకున్నం.
ఒక బాధ పోయింది. సాగుకు నీళ్లు రావాలి. ఎక్కడి నుంచి రావాలి.. నల్గొండ జిల్లా ఉండేది కృష్ణ బేసిన్లో.. శివన్నగూడెం ప్రాజెక్టు రావాలి.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తీసుకొని లిఫ్ట్ ద్వారా నింపుకోవాలి. దాని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నం. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు.. మన చేతుల్లో ఉన్న అధికార్ని ఎవరికో అప్పచెప్పి ఎవరో.. పోరాటం చేయమంటే చేయరు. ప్రజల చేతుల్లో ఉండే ఒకేఒక ఆయుధం ఓటు. దాని ద్వార నిర్మాణమయ్యే శక్తి.. మనకు ఉపయోగపడుతదా? పడదా? ఆలోచించి ఓటు వేయాలి.
మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చ పెట్టాలి.. ఆ చర్చలో భాగంగానే ఈ రోజు దేశంలో జరిగే వ్యవహారాలు, ప్రజావ్యతిరేక వ్యవహారాలకు, సమాజాన్ని చీల్చిచెండాడే విద్వేష విధానాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగాల్సి ఉందని జాతీయ, రాష్ట్రస్థాయి కమ్యూనిస్ట్ నాయకులు, ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్న. గత ఐదారు మాసాలు తలకాయ అంతా పలగొట్టుకుంటున్నమ్. ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేస్తున్నం. అందులో భాగంగా ఎక్కడ విధంగా ఏరాపేరి గోల్మాల్ ఉప ఎన్నిక వచ్చిందో తెలుసు. ఏ అక్కర ఉండి వచ్చింది ఇక్కడ ఉప ఎన్నిక’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.