CM KCR | తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏమిటి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అనేది బీఆర్ఎస్కు మాత్రమే తెలుసు. ఢిల్లీలో బాసులుండే పార్టీలకు, అక్కడోళ్ల అనుమతి లేనిదే అడుగు కూడా వేయని దద్దమ్మలకు తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఎలా తెలుస్తుంది? ఢిల్లీలో బాసులుంటే ఏం జరుగుతుందో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడోళ్లది ఇంకేమీ ఉండదు. తోలు బొమ్మల లెక్క ఢిల్లీయే నడిపిస్తది. గతంలో కాంగ్రెస్ ఏం చేసింది? పదేండ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో బేరీజు వేసుకుని ఓటెయ్యండి.
– సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘వ్యవసాయానికి 3 గంటలు కరెంటు చాలు అని కాంగ్రెస్వాళ్లు అంటున్నారు. మరి సరిపోతదా? రైతుబంధు దుబారా అంటున్నా రు.. దుబారానా? ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్నారు.. ధరణి ఉండొద్దా? కాం గ్రెస్కు ఓటేస్తే కరెంటు పోతది.. రైతుబంధు పో తది.. ధరణి పోతది.. ఇప్పుడు మీరే ఆలోచించండి.. అభివృద్ధి, సంక్షేమాన్ని తీసేసే కాంగ్రెస్ కావాలా? తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ కావాలా? ఏ పార్టీ విధానం ఏమిటనేది కూడా చూడండి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవటం పక్కా.. మీ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ వ్యక్తి అయితేనే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. లేదంటే దెబ్బే.. అందువల్ల ఆలోచించి ఓటేయండి’ అని ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూచించారు. మంగళవారం చెన్నూరు (మందమర్రి), మంథని, పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. గత వందేండ్ల కాలంలో తెలంగాణ ఈ పదేండ్లలోనే ప్రశాంతంగా ఉన్నదని తెలిపారు. ‘కర్ఫ్యూ లేదు, పం చాయితీ లేదు, లొల్లి లేదు, మంచిగా ఉన్నది. అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం. అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు తెల్లారితే కర్ఫ్యూ, మత కల్లోలాలు. ఆ పంచాయితీలన్నీ ఎవరు పెట్టా రో ఆలోచించండి’ అని సూచించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏమిటి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అనేది బీఆర్ఎస్కు మాత్రమే తెలుసు. ఢిల్లీలో బాసులుండే పార్టీలకు, అక్కడోళ్ల అనుమతి లేనిదే అడుగు కూడా వేయని దద్దమ్మలకు తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఎలా తెలుస్తుంది. ఢిల్లీలో బాసులుంటే ఏం జరుగుతుందో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడోళ్లది ఇంకేమీ ఉండదు. తోలు బొమ్మల మాదిరే.
– సీఎం కేసీఆర్
ఓటు ప్రజల చేతుల్లో ఉండే వజ్రాయుధమ ని, అది ప్రజల తలరాతను మారుస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆషామాషీగా, తమాషాగా, నాలుగు పైసలకు ఆశపడి, ఎవడో చెప్పిండడి ఓటు వేస్తే ఐదేండ్ల కష్టపడాల్సి వస్తదని హెచ్చరించారు. చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారు. బీఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని, తమకు ఢిల్లీలో బాసులెవరూ ఉండరని, తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్కు బాసులని స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీ బాసులకు సలాం చేయాల్సిందేనని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ 15 ఏండ్లు ఉద్య మం చేసి, అనంతరం పదేండ్లు అధికారంలో ఉండి ఏమేమి పనులు చేసిందో మీ కండ్ల ముందే ఉన్నాయని, వాటిని గమనించాలని కోరారు. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏమిటి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అనేది బీఆర్ఎస్కు మాత్రమే తెలుసు. ఢిల్లీలో బాసులుండే పార్టీలకు, అక్కడోళ్ల అనుమతి లేనిదే అడుగు కూడా వేయని దద్దమ్మలకు తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఎలా తెలుస్తుంది’ అని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ఏం చేసిం ది? పదేండ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో బేరీజు వేసుకుని ఓటెయ్యాలని సూచించారు. ‘13 లక్షల కుటుంబాలకు కల్యాణలక్ష్మి ఇచ్చాం.
కేసీఆర్ కిట్ తీసుకొచ్చాం. కంటివెలుగు పెట్టాం. చేనేతల ఉపాధి కోసం బతుకమ్మ చీరలు పం చుతున్నాం. దళిత జాతికి దళితబంధు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, అమ్మ ఒడి వాహనాలు ఎన్నో పెట్టాం. జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టి ఏడాదికి 10 వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నాం. బీసీలకు తలా రూ.లక్ష ఇస్తున్నాం. నాయీబ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం. దేశాన్ని, తెలంగాణను ఏండ్ల తరబడి పాలించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇటువంటి వాటిగురించి ఏనాడైనా ఆలోచనైనా చేశారా?’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, వేరేవాళ్లు గెలిస్తే రాష్ట్రం మళ్లీ అధోగతి పాలవుతుందని అన్నారు. చెన్నూరు చైతన్యముండే, ఉద్యమాలు జరిగిన నేల అని, అందుకే అందరూ ఓటేసే ముందు అన్నీ ఆలోచించాలని కోరారు.
రాష్ట్రంలో మళ్లీ దళారీ రాజ్యం తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది కేసీఆర్ విమర్శించారు. ‘కేసీఆర్ మొండి కాబట్టి ..అనుకున్నది సాధిస్తాడు కాబట్టి.. రైతులు కచ్చితంగా బాగుపడాలని గట్టి నిర్ణయం తీసుకున్నడు కాబట్టి 24 గంటల కరెంట్ సాధ్యమైంది. ఇప్పుడీ దొంగలొచ్చి 24 గంటల కరెంట్ తీసేస్తాం అంటున్నారు. ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నాడు. ధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్లొస్తది? వడ్లమ్మిన పైసలు ఎట్లొస్తయ్? రైతు చనిపోతే రైతు బీమా ఎట్లొస్తది? ఇవన్నీ ఆలోచించి ఓటేయండి’ అని సూచించారు.
ధరణి పోర్టల్ను తీసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు గొడ్డలి భుజంమీద పెట్టుకుని బయలుదేరింది. గవర్నమెంట్ తన వద్ద ఉన్న అధికారాన్ని రైతులకు ధారపోసింది. ఈ అధికారాన్ని ఉంచుకుంటారా? పోగొట్టుకుంటారా? మీరే ఆలోచించుకోండి. ధరిణిని తీసేస్తే రైతుబంధు ఎట్లొస్తది? వడ్లమ్మిన పైసలు ఎట్లొస్తయ్? రైతు చనిపోతే రైతు బీమా ఎట్లొస్తది? ఇవన్నీ ఆలోచించి ఓటేయండి.
– సీఎం కేసీఆర్
దళిత జనోద్ధారకుడైన బీఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీయే ఓడించిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. నేటి తరం ఇలాంటి వాస్తవాలను గ్రహించాలని సూచించారు. ‘అంబేదర్ మహాశయుడు అనేక పోరాటాలు చేశారు. ఆయనను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పా ర్టీయే. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అ మలు చేయలేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అంబేదర్ ఆశయాలను సాధిస్తున్నది. ప్రపంచంలోనే ఎకడా లేనంత ఆకాశమంత ఎత్తు 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని హైదరాబాద్లో పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి, మంత్రు లు కూర్చుండే సెక్రటేరియట్కు కూడా బీఆర్ అంబేదర్ సచివాలయం అని పేరుపెట్టుకు న్నాం. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రీ ఈ పనిచేయలేదు. కాంగ్రెస్ 75 ఏండ్ల క్రితమే ఏదైనా స్పెషల్ గ్రోత్ ఇంజిన్ పెట్టి అభివృద్ధి కార్యక్రమా లు చేపడితే అనాడే దళితజాతి బాగుపడేది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన దళితబంధు దేశంలో నే పెద్ద పొలికేక కార్యక్రమం. దళితబంధు ప్రతి కుటుంబానికి అందేవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది అని’ కేసీఆర్ స్పష్టం చేశారు.
సింగరేణిలో 49 శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇప్పుడు బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. ‘తెలంగాణ కొంగు బంగారం సింగరేణి. ఈ సంస్థకు 134 ఏండ్ల చరిత్ర ఉన్న ది. ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. తెలంగాణలో వెయ్యికోట్ల టన్నుల (10 బిలియన్) టన్నల బొగ్గు ఉన్నది. ఇప్పటివరకు ఒకటిన్నర బిలియన్ టన్నుల బొగ్గు కూడా వెలికి తీయలే. ఇంకా 850 కోట్ల టన్నుల బొగ్గు ఉన్నది. అసొంటి సింగరేణిని మునగ గొట్టినోడు ఎవడు? నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేతగాక కేంద్రం దగ్గర అప్పులు తెచ్చిం ది. ఆ అప్పులు తిరిగి కట్టలేక సింగరేణిలో కేంద్రానికి వాటాను కట్టబెట్టింది.
ఇంతచేసి ఇప్పుడు ఫోజులు కొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలె. సింగరేణిని ఎవడమ్మిండు? 49 శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాం గ్రెస్ పార్టీ కాదా? ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు సింగరేణి ప్రాంతాలకు వస్తే కార్మికులు నిలదీయాలి’ అని సూచించారు. తెలంగాణ ఏర్పడక ముందు సింగరేణికి రూ.414 కోట్ల లాభం ఉండేదని, తెలంగాణ వచ్చినంక ప్రణాళికతో ముందుకు పోవడంతో ఇప్పుడు రూ.2,184 కోట్ల లాభానికి చేరుకుందని తెలిపారు. కార్మికులకు దసరా, దీపావళి బోనస్ మునుపెన్నడూ రూ.3-4 వందల కోట్లు కూడా ఇవ్వలేదని, ఈ ఏడాది రూ.1000 కోట్ల లాభాలను కార్మికులకు పంచుకున్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో లాభాల్లో కార్మికులకు 18 శాతమే వాటా ఇచ్చారని, ఇప్పుడు 32 శాతం వాటా ఇస్తున్నామని తెలిపారు. ఒకో కార్మికునికి సగటున రూ.2.5 లక్షల వరకు వస్తున్నదని పేర్కొన్నారు.
గతంలో సింగరేణి కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటే పెద్దపెద్ద పైరవీలుండేవని, ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా 45 వేల మంది కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. ‘డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్, కమ్యూనిస్టు యూనియన్లే డిపెండెంట్ ఉద్యోగాల ఫైల్ మీద సంతకం పెట్టినయ్. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినంకనే డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించినం. అంతకుముందు పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 6,400. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించినవి 19,400. వాళ్లకు మాకు ఉన్న తేడా ఇదీ. కార్మికులు ఇండ్లు కట్టుకుంటమంటే రూ.10 లక్షల రుణం ఇస్తున్నం’ అని కేసీఆర్ వివరించారు. ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరించాలని, రెండు గనులపై కేంద్రం గురి పెడితే బాల్క సుమన్తోపాటు అందరం కలిసే అడ్డుకున్నామని గుర్తుచేశారు.
నిఖార్సయిన నేతలు కావాలో.. సూట్కేస్లతో వచ్చే నాయకులు కావాలో ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ సూచించారు. బాల్క సుమన్ మీ మధ్యనే పెరిగిన, మీ రే పెంచిన నిజాయితీ గల బిడ్డ అని, కాంగ్రెస్ నుంచి పోటీచేసే వ్యక్తి సూట్కేస్లతో మిమ్మల్ని కొనేయ్యాలని చూసే వ్యక్తని ప్రజలకు తెలిపారు. బాల్క సుమన్ను 60 వేల మెజార్టీతో గెలిపిస్తే మందమర్రికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ‘బాల్క సుమన్ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిండు. జైలుకు వెళ్లిండు. తెలంగాణ తెచ్చేదాకా కొట్లాడిండు. మీ ఆశీర్వాదంతో మొదట ఎంపీ అయిండు. ఆ తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే అయిండు. సుమన్ రాక ముందు, వచ్చిన తర్వాత చెన్నూరు ఎలా అభివృద్ధి చెందిందో ఆలోచించాలి. సూట్ కేసులతో వచ్చే దోపిడీ దారులు కావాలో.. జేబులో పైసా లేకుండా వచ్చే సింహం లాంటి వ్యక్తి కావాలో ప్రజలే నిర్ణయించాలి’ అని కేసీఆర్ సూచించారు. ఓటే వజ్రాయుధమని, విచక్షణతో ఓటెయ్యాలని కోరారు. అంతకంటే ముఖ్యంగా అభ్యర్థి వెనకున్న పార్టీ గురించి ఆలోచించాలని తెలిపారు.
బీసీ బిడ్డలకు అవకాశం రావడంలేదని అంటున్నారు. అవకాశం వచ్చినకాడ చైతన్యం ఏమవుతున్నది? ప్రతి బీసీ ఇంట్లో, ప్రతి ఎస్సీ ఇంట్లో, ప్రతి ఎస్టీ ఇంట్లో చర్చ జరగాలి. ఒక బీసీ నాయకుడు బలంగా ఎదిగి పనిచేస్తుంటే ఎందుకు ఆయన్ను ఇబ్బంది పెట్టాలి? అవకాశాలు వచ్చేదే తక్కువ మందికి. వచ్చినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితర బలహీనవర్గాల్లో ఐక్యత ఎందుకు లోపిస్తున్నది? బీసీ విద్యార్థులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చైతన్యాన్ని ప్రదర్శించాలి.
– సీఎం కేసీఆర్
మంథనికి ఎవరు ఏం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, పీవీ నర్సింహారావు హయాంలో మొదలుపెట్టిన రింగురోడ్డును పుట్ట మధు ఎమ్మెల్యే అయ్యాకే పూర్తిచేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. మధు తన తో మాట్లాడి, బతిమిలాడి కొన్ని వందల కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేశారని తెలిపారు. మంథనిలో ఇప్పుడున్న ఎమ్మెల్యే మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారని, మంత్రిగా పనిచేశారని, వాళ్ల నాయన అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారని, మరి మంథనికి ఏం చేశారని ప్రశ్నించా రు. ‘బీసీ బిడ్డలకు అవకాశం రావడంలేదని అంటున్నారు. అవకాశం వచ్చినకాడ చైతన్యం ఏమవుతున్నది? ప్రతి బీసీ ఇంట్లో, ప్రతి ఎస్సీ ఇంట్లో, ప్రతి ఎస్టీ ఇంట్లో చర్చ జరగాలి. ఒక బీసీ నాయకుడు బలంగా ఎదిగి పనిచేస్తుంటే ఎందుకు ఆయన్ను ఇబ్బంది పెట్టాలి? అవకాశాలు వచ్చేదే తక్కువ మందికి. వచ్చినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితర బలహీనవర్గాల్లో ఐక్యత ఎందుకు లోపిస్తున్నది? బీసీ విద్యార్థులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చైతన్యాన్ని ప్రదర్శించాలి’ అని సూచించారు.
మట్టిపనికైనా ఇంటోడు కావాలని, హైదరాబాద్లో ఉండేవాళ్లకు ఓట్లు వేస్తే ఏం ఫలితం ఉం టదని ప్రశ్నించారు. ‘ఎర్రిలో పడి ఓటువేస్తే లాభంలేదు. ఇక్కడే ఉండి ముడ్డికి మన్నంటంగ తిరిగినోడే సిపాయి. వాడే గెలవాలి. వాళ్లు గెలిస్తేనే మనం బాగుపడతాం. అంతేతప్ప ైస్టెల్గా వచ్చి, చేతులు ఊపి మాట్లాడేవాళ్లతోని ఏం కాదు. ఒక బీసీ బిడ్డకు అవకాశం వచ్చింది. చైతన్యం చూపెట్టి తప్పకుండా పుట్టమధును గెలిపించండి. నేనే ఒకరోజంతా మం థనిలో ఉండి, అవసరమైతే ఒక వెయ్యికోట్లు మంజూరుచేసి మంథనిని తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా’ అని హామీ ఇచ్చారు. ‘మంథని ప్రజల అవసరాలు పుట్ట మధుకు బాగా తెలుసు. మండల నాయకులను పిలుచుకొని అందరం కూర్చొని, ఆఫీసర్లను కూడా కూర్చోబెట్టుకొని ఏమేమి కావాల్నో చేసిపెట్టే బాధ్యత నాదే. ఈ విషయాన్ని గ్రామగ్రామాన చెప్పాలని కార్యకర్తలు, నాయకులకు విజ్ఞప్తిచేశారు. మంథని వెనుకబడిన ఏరియా కాబట్టి ప్రత్యేక నిధి సమకూర్చి మధు ఆధ్వర్యంలో అన్ని పనులు చేసుకుందాం’ అని వివరించారు.
తెలంగాణలో పదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి జరిగిందని, పెద్దపల్లి పదేండ్ల క్రితం ఎ ట్లుండేది? ఇప్పుడు ఎట్లయిందో చూస్తే ఈ వి షయం తెలిసిపోతుందని సీఎం కేసీఆర్ అన్నా రు. ‘పెద్దపల్లి బరిలో ఉన్న మనోహర్రెడ్డి వి ద్యావేత్త.. ఎమ్మెల్యే అయ్యాడు. నిస్వార్థంగా పని చేస్తడు. ఈ పదేండ్లలో ఒకరోజు కూడా వ్యక్తిగత పనుల గురించి అడగలేదు. పెద్దపల్లి పనులు.. ఆయకట్టుకు నీళ్లు వస్తలేవు. మీద మోటర్లు పెడుతున్నారని నాకు చెప్పేవారు. ఓ దెల శ్రీరాంపూర్కు నీల్లు పోవాలని అడిగారు. రైతుల గురించి తపన పడిండు. పదేండ్ల కింద నే రూ.40 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి ఊరికి మొ క్కలు పంపిణీ చేసిండు. నియోజకవర్గం బాగుపడాలని ఆలోచిస్తడు. ఆయనకు డ్రామాలు, నాటకాలు వేసుడు రాదు. దొంగ దీక్షలు చేసుడు ఆయనకు రాదు. సాదాసీదాగా మీ మధ్య ఉండే వ్యక్తి. మీ కోసం పనిచేసే వ్యక్తి. లక్ష ఓట్ల మెజార్టీతో మనోహర్ రెడ్డిని గెలిపించాలి’ అని కేసీఆర్ కోరారు.
ప్రజల ఆలోచనా సరళి మారనంత వరకు సూట్కేసు బాపత్ గాళ్లు వస్తనే ఉంటరు. వాళ్ల బలమంతా డబ్బే. వాళ్లు ఎకడా కనిపించరు. కానీ ఎలక్షన్లు రాంగనే వస్తరు. రెండు సీసలు తాగిపో అంటరు. ఇంతకూ.. నీ ఇంట్లేమన్న లగ్గముందా? ఏమన్నా కార్యముందా? సీసలు ఎందుకిస్తున్నడన్నది ఆలోచించాలి.
– సీఎం కేసీఆర్
ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముం చిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ ఈ దేశం లో, రాష్ట్రంలో ఏకబిగిన 50 ఏండ్లు అధికారంలో ఉన్నది. 1956 వరకు ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. సిటీ కాలేజీలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం జరుగుతుంటే ఏడుగురు విద్యార్థులను కాల్చిచంపి, ఎన్ని విజ్ఞప్తులు చేసినా వినకుండా తెలంగాణను ఆంధ్రలో కలిపిం ది. దాంతో 58 ఏండ్లు గోస పడ్డాం. మలిదశ ఉద్యమాన్ని సైతం అణచివేయాలని ప్ర యత్నించింది కాంగ్రెస్ కాదా?చావు నోట్లో తలకాయబెట్టి మొండిగా పోరాడితే విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చింది. మీరంతా సాక్షులే’ అని అన్నారు.