CM KCR | మానకొండూరు : కాంగ్రెస్ పరిపాలనలో పత్తికాయలు పగిలినట్లు రైతుల గుండెలు పగిలి ఆత్మహత్య చేసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని రసమయి బాలకిషన్కు మద్దతుగా ప్రసంగించారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజలు, హక్కుల కోసం. ఈ రాష్ట్రాన్ని 50 ఏండ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇల్లంతకుంటతో పాటు పలు మండలాల్లో పత్తి కాయ పగిలినట్లు మావోళ్లు గుండెలు పగిలిపోయి చనిపోయారని బాలకిషన్ గుర్తు చేశారు. పత్తికాయలు పగిలినట్టు రైతుల గుండెలు పగిలి ఆత్మహత్య చేసుకున్నది అప్పులపాలైంది కాంగ్రెస్ రాజ్యంలో అని కేసీఆర్ తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అంటున్నారు. అన్నమే లేకుండే.. తిన్నోడు తిన్నడు తిననోడు తినలేదు. ఇందరిమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామరావు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఇందిరామ్మ రాజ్యం బాగుంటే.. ఎన్టీ రామారావు 2 రూపాయాలకే కిలో బియ్యం ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ ఆలోచించాలి. ఆ బియ్యం పెట్టిన తర్వాత పేదల కడుపు నిండింది. అప్పటిదాకా సగం తిని సగం పడుకున్న వాళ్లు ఉండ్రి. ఇది నిజం కదా..? ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే హైదరాబాద్, బొంబై, భీవండి ఎందుకు వలసపోయారు. కూలినాలీ చేసుకునే గతి ఎందుకు పట్టింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ. అందర్నీ పట్టుకుపోయి జైళ్లో వేసుడు. ప్రభుత్వాలు కూలగొట్టుడు. అది ఇందిరమ్మ రాజ్యం అంటే. ఉన్నోడు ఉండే లేనోడు లేకనే ఉండే. మళ్లా ఆ రాజ్యం తెస్తమని మాట్లాడుతున్నారు ఎవర్ని గోల్ చేయడానికి. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ కదా..? 58 ఏండ్లు కోట్లాడి బయటపడ్డాం. ఎంతో గోస పోసుకున్నారు. ఇల్లంతకుంటలో నా క్లాస్మేట్స్, స్నేహితులు ఉండే, సిద్దిపేటలో చదివినోళ్లు. పెళ్లిళ్లకు కూడా వచ్చాను. ఎక్కడ చూసినా దుబ్బలే ఉండే. ఏం లేకుండే, మన్ను కూడా లేకుండే, బతక లేకుండా ఉండే. వానాకాలం పంట పండితే పండినట్టు. చివరకు గడ్డి లేక పశువులను అమ్ముకున్న దయనీయ పరిస్థితి అని కేసీఆర్ పేర్కొన్నారు.