జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి (Singareni workers)లో 12 వేల మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు వచ్చాయంటే అందుకు కారణం సీఎం కేసీఆరేనని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Venkataramana Reddy )అన్నారు. బుధవారం భూపాలపల్లిలోని కేటీకే 1 ఇంక్లైన్ వద్ద తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గేట్ మీటింగ్కు హాజరై మాట్లాడారు. సింగరేణి డిస్మిస్ కార్మికుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాను.
భూపాలపల్లిని మున్సిపాలిటీగా చేసి సింగరేణి కార్మికుల హెచ్ఆర్ఏను పెరిగేలా చేశానని పేర్కొన్నారు. కార్మికుల కాలనీలకు జీవో 76 ద్వారా పట్టాలు ఇప్పించాను. చేసిన సేవలను గుర్తించండి. మళ్లీ గెలిస్తే ఒక యూనియన్ నాయకునిగా పనిచేస్తానని హామీనిచ్చారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.