CM KCR | ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అసెంబ్లీ గడప తొక్కనివ్వమని మాట్లాడుతున్నారని.. అసెంబ్లీకి పంపేది మీరా? ఆ సన్నాసుల అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అలాగే ధరణి పోర్టల్ తెచ్చుకున్నాం. ధరణి పోర్టల్లో ఎవరి భూమి వాళ్ల పేరుమీదున్నది. ధరణిలో రైతు పేరు వచ్చిందంటే ఎవరూ గోల్మాల్ చేసే పరిస్థితి లేదు. రైతులు నిశ్చింతగా ఉండొచ్చు. అందుకే చాలాపెద్ద సంఖ్యలో రైతులకు పొడుభూములు ఇచ్చాం. ఎవరూ గతచరిత్రలో ఎవరూ ఇవ్వలేదు. దాదాపు 15,107 కుటుంబాలకు 48,300 ఎకరాలు ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఇల్లెందుకు నియోజకవర్గానికి ఓ గర్వం ఉన్నది’ అన్నారు.
‘హరిప్రియ నాయక్ చరిత్రలో ఉంటది. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటైమ్లో ఇల్లెందు నియోజకవర్గంలో 48వేల ఎకరాలకుపైగా పొడు భూములను మీకు అందించడం జరిగింది. పొడు భూములు అందించడమే కాదు.. దానిపై ఉన్న కేసులన్నీ రద్దు చేశాం. అలాగే రైతుబంధు కూడా ఇచ్చాం. గుండాలలాంటి మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతంలో త్రీ ఫేజ్ కరెంటు ఇస్తున్నాం. దాంతో గిరిజన రైతులు కూడా సగర్వంగా వ్యవసాయం చేసుకోవాలని రైతుబంధు, బీమా తీసుకువచ్చాం. కేసులను రద్దు చేశాం. ఇలా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. ఇల్లెందు గ్రామాల్లో వానపడ్డదంటే చెప్పులు చేతలోపట్టుకొని నడిచేపోయే పరిస్థితి ఉండే. ఎక్కడా రోడ్లు సరైన రోడ్లు లేకుండే. హరిప్రియ నాయక్ నాతో కొట్లాడి రూ.వందలకోట్ల రోడ్లు మంజూరు చేసి.. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో చక్కటి రోడ్లు మంజూరు చేయించి. ఇల్లెందు పట్టణానికి కూడా రూ.400కోట్లు దాకా తీసుకువచ్చి అభివృద్ధి చేశారు’ అని పేర్కొన్నారు.
‘గతంలో పట్టణం డర్టీగా ఉండేది. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్, సీసీరోడ్లు తదితర పనులతో కొంత అందం వచ్చింది. ఇవన్నీ గతంలో జరుగలే. కానీ, హరిప్రియ అన్నీ చేసింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. దయచేసి ఎవరు ఏం చేశారు. గతంలో ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు ఉండేకదా..? ఏ ప్రభుత్వం ఎవరికి న్యాయం జరిగిందో ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా చేస్తే మళ్లీ మనకు ఇబ్బందులు వచ్చే పరిస్థితులంటయ్. కొమురారంతో పాటు రెండుమండలాలు కావాలని హరిప్రియ కోరింది. హరిప్రియ నాయక్ నా బిడ్డలాంటిది. నా బిడ్డ కోరిన తర్వాత కాదనే పరిస్థితి కాదు. ప్రజల తరఫున కోరుతుంది. ఎన్నికల తర్వాత కొత్త మండలాలను ఏర్పాటు చేస్తాం. ఒకమాటిక్కడ మనవి చేయాలి. ఈ జిల్లాలో కొంత మంది ఉన్నరు. వాళ్లకు డబ్బులు వచ్చాయి.. అహంకారం పెరిగిపోయింది. ఇక్కడి నుంచి ఎవరం కూడా బీఆర్ఎస్ నాయకులను అసెంబ్లీ గడప తొక్కనివ్వమని ప్రతిజ్ఞలు చేస్తున్నరు. అసెంబ్లీ గడప తొక్కేందుకు పంపేది మీరా? ఆ సన్నాసులా? ఎవరు పంపేది మీరే కదా?’ అన్నారు.