CM KCR | పేదల సంక్షేమం ఎవరైనా ఆలోచించారా? పేదింటి పిల్ల పెళ్లికి లక్ష రూపాలు ఇవ్వాలని ఏ ప్రభుత్వమన్న ఆలోచించిందా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పేదల సంక్షేమం ఆలోచించారా? ఎన్నడన్న ఎవడన్నా పేదల పిల్లల పెళ్లయితో ఓ లక్ష రూపాలు ఇవ్వాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా? వాళ్ల మైండుకన్నా తట్టిందా? పేదవాళ్లు ఉంటే వాళ్ల కండ్లు చూపించాలి.. కళ్ల అద్దాలు ఇవ్వాలి.. కంటి వెలుగు ప్రోగ్రామ్ పెట్టాలని ఓ గవర్నమెంటన్నా ఆలోచించిందా ? ఆడ పిల్లలు ప్రసూతికి పోతే.. డాక్టర్లు అడ్డమైన దోపిడీ చేస్తే.. కేసీఆర్ కిట్టు పెట్టి గవర్నమెంట్ దాఖాలను బలోపేతం చేశాం. ఏవిధంగా 13లక్షల కుటుంబాలకు కల్యాణలక్ష్మి వచ్చిందో మీకు తెలుసు’నన్నారు.
‘ఏ విధంగా పేదలను ఆదుకుంటున్నామో తెలుసు. చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరలను తీసుకువచ్చాం. అవి పీతాంబరాలు కాకపోవచ్చు. అటు కార్మికులకు బతుకుతున్నరు. ఇటు పేదసాదలకు ఓ చీర దొరుకుతున్నది. రెండు ప్రయోజనాలు నెరవేరుతున్నాయ్. ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. విద్య విషయంలో ఇవాళ రెసిడెన్షియల్ కళాశాలలు వచ్చాయ్. పెద్దపల్లిలో కూడా చాలా ఉన్నయ్. ఎంతబాగున్నయ్ కాలేజీలు. అందరికీ పెట్టుకున్నాం. గిరిజనులకు, మైనారిటీలకు, బీసీలకు పెట్టినాం, ఎస్సీలకు పెట్టినాం. ఈ మాధ్య నాపై ఒత్తిడి వచ్చింది. ఓసీలం మేం కూడా ఉన్నం. మాదాంట్లో పేదలున్నారు మాకు కాలేజీలు వద్దా అని అడిగారు. అందుకే మొన్న నియోజకవర్గానికో ఒకటి చొప్పున 119 ఓసీల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని ప్రకటించాం. ఎవరు పేదలైతే వారికి న్యాయం జరగాలి. ఎంత బ్రహ్మాండమైన విద్య దొరుకుతుంది విద్యార్థులకు. మరి ఈ రెసిడెన్షియల్ పాఠశాలలను వాళ్లు ఎందుకు పెట్టలేదో ఆలోచించాలి’ అన్నారు.
‘ఈ రోజు బస్తీ దవాఖాలు, పల్లె దవాఖానాలు, అమ్మ ఒడి వాహనాలు, కేసీఆర్ కిట్ ఇవన్నీ సామాజిక బాధ్యతతో, సామాన్య, నిరుపేద ప్రజలకు అవసరమైన స్కీమ్స్ తీసుకువచ్చాం. గతంలో ఇవన్నీ ఎందుకు ఆలోచన చేయలేదు అని అడుగుతున్న. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మేం మేనిఫెస్టోలో చెప్పినయ్ తక్కువ.. పెట్టకుండా చేసినయ్ ఎక్కువ. చాంతాడంత లిస్టున్నది. పేద పిల్లలకు సీటు వస్తే రూ.20లక్షల గ్రాంట్ ఇచ్చి విదేశాలకు ప్రభుత్వం ఉండెనా ? జ్యోతిబా ఫూలే మీద, అంబేద్కర్, ఇతరుల పేర్లను పెట్టి సాయం అందిస్తున్నాం. ఇవాళ జిల్లాకో మెడికల్ కాలేజీ మనం అనుకున్నమా జీవితంల. అసలు పెద్దపల్లి జిల్లా అయితుండే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే.. తెలంగాణ రాకపోతే. మనోహర్రెడ్డే ఎమ్మెల్యే లేకపోతే పెద్దపల్లి జిల్లా వచ్చేదా? పెద్దపల్లి జిల్లా తెచ్చినందుకైనా లక్ష మెజారిటీతోని మనోహర్రెడ్డిని గెలిపించాలి. ఓ గ్రోత్ సెంటర్ రావాలి కరీంనగర్-మంచిర్యాల మధ్యన అని నేను ఆలోచిస్తుంటే.. పెద్దపల్లిలో పెట్టండంటూ నా వద్ద కూర్చొని పెద్దపల్లిని జిల్లా చేయించిందే మనోహర్రెడ్డి’ అంటూ సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.