CM KCR | కాంగ్రెసోళ్లు దళారీ రాజ్యం.. పైరవీకారుల రాజ్యం తెస్తామంటున్నారని.. మూడు గంటల కరెంటే ఇస్తామంటున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ హాలియాలో జరిగింది. కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడారు. ‘కాంగ్రెస్ రైతుబంధును దుబారా.. ఇది వద్దంటున్నరు. రైతుబంధు ఇచ్చేటోడు ఉండాల్నా..? రైతుబంధు వేస్ట్ అనేటోడు ఉండాలా? మీరే నిర్ణయం తీసుకోవాలి. పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నడు. 24గంటల కరెంటు కేసీఆర్ వేస్ట్గా ఇస్తున్నడు అని మాట్లాడుతున్నడు. మూడు గంటల కరెంటుతో పొలాలు పారుతయా? మరి ఎన్నిగంటల కరెంటు ఉండాలి? 24 గంటల కరెంటు ఉండాలంటే భగత్ గెలవాలి’ అన్నారు.
‘వాళ్లు డైరెక్టర్గా చెబుతున్నరు. ఇంకో డేంజర్ మాట చెబుతున్నరు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తరటా. ఎవరి కోసం ధరణిని బీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చింది. రైతుల కోసమే కదా.. రైతుబంధు ఇవాళ ఎలా వస్తుంది ? అక్కడ మీరు పేరుమీద ఎన్ని డబ్బులు వేస్తున్నమో మీ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నయ్. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతుబీమా సొమ్ము రైతుల ఖాతాల్లో పడుతున్నయ్. ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు లేకుండా ఖాతాల్లో పడుతున్నయ్. ధరణి తీసివేస్తే మరి ఖాతాల్లో డబ్బులు ఎలా పడాలి ? ఇది సీరియస్ విషయం ఆలోచించాలి. ఇది చెబుతున్నది ఎవరో ఆషామాషీగాళ్లు చెప్పడం లేదు. కాంగ్రెస్ వస్తే తీసివేస్తమని రాహుల్ గాంధీ చెబుతున్నడు. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చెబుతున్నడు’ అని తెలిపారు.
‘పదెకరాల భూమి ఉందనుకో.. ఎమ్మార్వో ఆఫీసు, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఇవాళ ఎక్కడికి వెళ్లే అవసరం లేకుండా, దరఖాస్తు లేకుండా.. రూపాయి లంచం ఇవ్వకుండా.. రూపాయి తక్కువ కాకుండా ఎంత వేసినమో అంత డబ్బు నీ కడుపుల చల్ల కదలకుండా నీ చేతికి వస్తుంది. ధరణిని తీసివేస్తే మళ్లీ ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాలి. ఎన్ని ఎకరాలున్నది నీకు.. ఎంత వస్తది.. లక్ష వస్తదంటే రూ.30వేలుతే అంటడు. మళ్లీ దళారీల రాజ్యం. కాంగ్రెస్ రాజ్యంలో ఎలాగైతే రిజిస్ట్రేషన్ ఆఫీసులకాడ పడిగాపులు పడ్డమో.. భూమి పట్టా కావాలంటే ఏడాది రెండేళ్లు తిరిగినమో.. అదే రాజ్యం కావాలా? ఆలోచించాలి’ అని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.
‘మూడు గంటల కరెంటుతో పది హెచ్పీ మోటర్తో పారుతదట. పది హెచ్పీల మోటర్ ఎవరు కొనివ్వాలి. రైతులదగ్గర పది హెచ్పీల మోటర్ ఉంటదా? రైతులకు ఉండేది మూడు హెచ్పీ, ఐదుహెచ్పీల మోటర్. మరి మోటర్ ఎవరు కొనివ్వాలి. వీని తాత కొనిస్తడు. ఎవడు కొనిస్తడు. ఇంత సీరియస్ మాటలు వాళ్లు చెబుతున్నరు. ధరణి తీసివేస్తం.. దళారీ రాజ్యం తెస్తం. మళ్లీ పైరవీకారుల రాజ్యం తెస్తం. కరెంటు మూడుగంటలే ఇస్తం అంటున్నరు. ఇంకా విచిత్రం తెలుసా మీకు. కర్నాటక నుంచి ఓ పెద్ద కాంగ్రెస్ లీడర్ వచ్చింది. ఆయన పేరు డీకే శివకుమార్, ఆయన కర్నాటకల ఉప ముఖ్యమంత్రి.. ఆయన వచ్చి నాకు చెబుతున్నడు. కేసీఆర్ కావాలంటే కర్నాటకకు వచ్చి చూడు.. మేం ఐదుగంటలు కరెంటు ఇస్తున్నం అంటున్నడు. సన్నాసి మేం 24గంటల కరెంటు ఇస్తున్నం.. నేను నీ ఐదుగంటల కరెంటును చూసేందుకు నేనేం రావాలని అని చెప్పిన’ అన్నారు.