మెదక్ : అనుక్షణం నిరుపేదలు, రైతుల కోసం శ్రమించే ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రభువు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రార్థించారు. ఆదివారం క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. జాతీయస్థాయిలో విస్తరించిన బీఆర్ఎస్కు ప్రభువు దీవెనలతో పాటు క్రైస్తవుల అండదండలు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
తెలంగాణలోని అన్ని మతాలను సమానంగా గౌరవించడంతో పాటు పండుగల రోజున దుస్తులు, విందులు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఆమె వెంట ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి , బీఆర్ఎస్ నాయకులున్నారు.