KCR Pressmeet | పార్టీకి చందాలిచ్చేటోళ్లను బీజేపీ ప్రోత్సహిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. వేలకోట్లు దిగమింగి వాళ్లు ఇచ్చే సోలార్ విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఇదేనా చట్టం అని మండిపడ్డారు.
ప్రగతిభవన్లో ప్రెస్మీట్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీకి చెందిన ప్రతివాళ్లు దారుణంగా అబద్ధాలు ఆడుతున్నరు. వీళ్లు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అఖిల భారత విద్యుత్ సంస్థల ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కటై సమావేశాలు పెట్టాయి. మన దగ్గర మింట్ కాంపౌండ్ దగ్గర కూడా ఎలక్ట్రిసిటీ శాఖ వాళ్లు ధర్నాలు చేశారు. మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి.. ఇప్పటికే ఉత్పత్తి ఉన్నవాటిని పెట్టనీయకుండా చేసి వాళ్ల పార్టీకి చందాలు ఇచ్చేటోళ్లకు, పార్టీని సాదేటోళ్లకు వాళ్ల ఎన్నికలకు డబ్బులు ఇచ్చేటోళ్లకు వేల కోట్ల రూపాయలు దిగమింగి వాళ్లు పెట్టే సోలార్ విద్యుత్ను వీళ్లు కొనాలట ఇప్పుడు. అదే ఇప్పుడు చట్టం. ఇదేనా విద్యుత్ సంస్కరణ. మన తెలంగాణకు జలవిద్యుత్ శక్తి అందుబాటులో ఉన్నదే కృష్ణా నది మీద ఎక్కువగా. నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల జూరాల. 2500 మెగా వాట్ల దాక ఉంటుంది. గోదావరి మీద తక్కువ ఉంది మనకు. ఈ దిక్కుమాలిన చట్టంలో ఇంకా ఏం చెప్పారంటే..వాళ్ల బీజేపీ మిత్రులు పెట్టే 30 నుంచి 40 వేల మెగావాట్ల సోలార్ పవర్ మనం కొనాలట క్లీన్ ఎనర్జీ కింద. మనది క్లీన్ ఎనర్జీ అయినా మీ నాగార్జున సాగర్, శ్రీశైలం ద్వారా వచ్చే పవర్ ను బంద్ పెట్టి అయినా దీన్నికొనాలట. లేకపోతే ఫైన్ వేస్తరట. ఇదే చట్టం. అని విమర్శించారు.