CM KCR | మిషన్ భగరీథ పథకం గెలవాలా..? సుదర్శన్రెడ్డి గెలవాలా? వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా? నర్సంపేట ఆలోచించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. నర్సంపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చాలా పెద్ద ప్రమాదం రాబోతున్నది. వ్యవసాయం, రైతులు బాగుండాలని శపథం తీసుకున్నాం. ప్రతిజ్ఞ తీసుకున్నాం. పట్టుబట్టాం. రైతుబంధు భూమండలం మీద ఎక్కడ లేదు. రైతుబంధును పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది మీ అందరికీ తెలుసు. భారతదేశం తెలంగాణలో నీటి తీరువా లేదు. పాత నీటి తీరువా బకాయిలు రద్దు చేశాం. 24 గంటల ఫ్రీ కరెంటు ఇస్తున్నాం. రైతుబంధు ఇస్తున్నాం. రైతుబీమా అమలు చేస్తున్నాం. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలను పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. రైతుల అప్పులు పోవాలని, బాధలను పోవాలని ఇవన్నీ చేస్తున్నాం. కాంగ్రెస్ నేతలు రైతుబంధు దుబారా అంటున్నారు. మేం రూ.10వేల నుంచి రూ.16వేలకు తీసుకుపోతాం అంటున్నం. మరి ఎవరు గెలవాలి.. ఎవరి వైఖరి ఏంటీ అని ఆలోచన చేయాలి. ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.
‘కృష్ణా, గోదావరి నదులు ఉన్నా నీళ్లు ఇవ్వ చేతకాలేదు. ఇదే కాంగ్రెస్ 50 పరిపాలన చేయలేదు. ఎందుకివ్వ లేదు. చేనేత కార్మికులను ఎందుకు ఆదుకోలేదు. రైతులకు మద్దతు ఇవ్వలేదే ఆలోచన చేయాలి. ఏ పార్టీ వైఖరి, నడక ఏంది? ఎవరు ఎవరి గురించి ఏం ఆలోచిస్తారో ఆలోచించి ఓటువేయాలి. ఐదేళ్లకోసారి ఒకసారి వచ్చి.. ఇన్ని సీసాలు తెచ్చి.. ఇగరాబిడ్డ ఇగరా.. రెండు సిసాలు తాగు.. ఓటు గుద్దు. వాళ్లకా ఓట్లు వేసిది? సుదర్శన్రెడ్డి హైదరాబాద్కు రానేరాడు. వస్తే కూడా ఆయన కారు ఆగనే ఆగది. తెల్లారే సరికి నర్సంపేటలో వచ్చిపడుతడు. పొద్దాక మీ మధ్య ఉండి.. నర్సంపేట నియోజకవర్గాన్ని ఎట్లన్న చేసి బాగు చేసుకోవాలనే సుదర్శన్రెడ్డి రావాలన్నా? టూరిస్టుల్లా ఐదేళ్లకోసారి వచ్చేవాళ్లు కావాల్నా? ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టినం. సుదర్శన్రెడ్డి వచ్చి అన్న ప్రైవేటువే గర్నమెంట్వో వరంగల్లో ఉన్నయ్.. వరంగల్ కోటాలో ఉన్న మెడికల్ కాలేజీని నర్సంపేటలో పెట్టాలని మంజూరు చేసేదాక పట్టివట్టి కూసున్నడు’ అన్నారు.
‘సుదర్శన్రెడ్డి స్థానంలో మరో ఎమ్మెల్యే ఉంటే నర్సంపేటకు మెడికల్ కాలేజీ వచ్చేదా? గోదావరి నీళ్లు వచ్చినా.. కాళేశ్వరం నీళ్లతో 270 చెరువులను నింపుకుంటున్నం. గతంలో ఈ ప్రాంతమంతై కొట్లాటలు.. హత్యలు, కల్లోలాలు ఉండే. పదేళ్ల నుంచి నర్సంపేట ప్రశాంతంగా ఉన్నది. సుదర్శన్రెడ్డి నాయకత్వంలో పేదల కోసం మంచి పనులు జరుగుతున్నయ్. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సభకు వచ్చుడు కాదు. ఇదే పద్ధతిలో 30వ తారీఖున ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వేయాలి. తెలంగాణలో కొనసాగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే.. మళ్లీ పెడదారిన పట్టదంటే.. పేదల సంక్షేమం ఆగవద్దంటే బీఆర్ఎస్ రావాలి. ఎవడో యాల్లకు వచ్చి ఏం అది చేస్తాం.. ఇది చేస్తాం అంటున్నరు. నర్సంపేటకో ప్రత్యేక ఉన్నది. సమైక్యవాదులు, వాళ్ల చెంచాలు రాజ్యం చేస్తామంటే ఇక్కడ నిరసన తెలిపారు. నిరసన తెలిపారని వైఎస్ షర్మిల అనేటామె పగబట్టిందట? డబ్బు కట్టలు పంపిస్తదట? మరి వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలువాలా? మరి మిషన్ భగీరథ మంచినీళ్లు గెలవాల్నా.. 24 గంటల కరెంటు గెలవాలా?.. ఎవరు గెలవాలి ఆలోచన చేయాలి. పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి డబ్బు సంచులు పంచి మిమ్మల్ని ఓడిస్తమంటే మనం ఓడిపోదామా? దయచేసి నర్సంపేట ఆలోచించాలి’ అన్నారు.
‘మీరు ఇవాళ సుదర్శన్రెడ్డిని గెలిపించి మంచి పని చేశారు. ఆరు నూరైనా పోయినసారికంటే ఎక్కువ సీట్లతో మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే సుదర్శన్రెడ్డిని గెలిపిస్తేనే లాభం జరుగుతుంది. సుదర్శన్రెడ్డి కావాలని కోరిన పనులన్నీ ఇబ్బందికరం ఏమీ కాదు. పాకాల కాలువలు, రంగయ్యచెరువు కాలువలను బాగు చేయాలనున్న గ్యారంటీగా చేద్దాం. నర్సంపేట చుట్టూ రింగ్రోడ్డు కావాలంటున్నడు తప్పకుండా చేద్దాం. మీ తరఫున మీ అందరి మంచికోసం కోరాడు. సుదర్శన్ రెడ్డిని గెలిస్తే ఎన్నికల తర్వాత నర్సంపేటకు వచ్చి ఒక రోజంతా మీ మధ్యనే ఉంటాను. మాకు కావాల్సిన పనులన్నీ చేసిపెడుతాను. ఎన్నికల్లో సుదర్శన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.