CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) శ్రీరామ నవమి( Sri Rama Navami ) శుభాకాంక్షలు తెలిపారు. సీతారామచంద్రమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా, ఇలవేల్పుగా హిందువులు కొలుచుకుంటారని తెలిపారు. శ్రీరాముని( Sri Ramudu ) జీవితం తరతరాలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగించేందుకు శ్రీరామ నవమి ఒక ప్రత్యేక సందర్భం అని తెలిపారు.
భద్రాచలం( Bhadrachalam ) శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం( TS Govt ) అధికారికంగా, వైభవోపేతంగా నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ( telangana ) రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రార్థిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.